2017వ సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం పలు రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు 37 శాతం పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీనివల్ల తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని రాష్ట్రంలోని పలు సంస్థలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. అప్పుడే ఢిల్లీ హైకోర్టు ఈ నిర్ణయంపై స్టే విధించింది.
అయితే తాజాగా గ్యాడ్యుయెట్లు, రోజువారీ కూలీలు, క్లర్కులు, సూపర్ వైజర్లు.. ఇలా పలు రంగాలలో పని చేస్తున్న ఉద్యోగులకు అందరికి శుభవార్త చెప్తూ తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు. మూడేళ్ళ క్రిందట ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ అమలు చేయాలనీ సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్టు తాజా తీర్పు వల్ల ఇప్పటినుండి గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం 19వేల రూపాయిలు కానుంది.
అయితే తాజాగా ఆ నోటిఫికేషను తిరిగి అమలు చేయాలనీ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం 19,572 రూపాయిలు అయ్యింది. ఈ కేసుకు వ్యతిరేకంగా దాఖలు అయినా ఆపిల్స్ అన్నింటిపై త్వరితగతిన విచారణ చేపట్టి పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది.
అదే నోటిఫికేషన్ లో అనేక నోటిఫైడ్ జాబ్స్ కు కనీస వేతనం నిర్ణయించారు. నైపుణ్యం లేని కార్మికుడికి నెలకు 14,842 రూపాయిలు, సెమి స్కిల్డ్ వర్కర్ కు నెలకు 16,341 రూపాయిలు, ఎక్సపీరియెన్సుడ్ వర్కర్ కు నెలకు 17,991 రూపాయిలు గా నిర్ణయించారు. అలాగే క్లర్క్ లు, సూపర్ వైజర్లుకు 10వ తరగతి పాస్ అయినా వారికీ 16,341 రూపాయలుగా, ఇంటర్ పాస్ అయిన వారికీ 17,991 రూపాయలుగా, డిగ్రీ, ఆపైన విద్యార్హత ఉన్న వారికీ 19,572 రూపాయిలుగా నిర్ణయించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…