అలనాటి మేటి నటీమణులు ఎవరంటే భానుమతీ, సావిత్రి, అంజలి లాంటి పేర్లు గుర్తుకు వస్తాయి. మహానటి సావిత్రి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆమె నటనాభినయం గురించి మహానటి సినిమా ద్వారా అందరికీ తెలిసిపోయింది. తన బాల్యంలో తండ్రి మరణానంతరం కష్టపడి పైకొచ్చిన అతి కొద్దీ నటుల్లో సావిత్రి గారు ఒకరు.
నటన రాదు, డైలాగు చెప్పరాదు అన్న దర్శకులతో నే శభాష్ అనిపించుకున్న నటి సావిత్రి. అనతికాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగి అంతే స్థాయిలో ఆ సినిమాలో సర్పంచ్ భార్యగా ఆమె నటించారు. ఆ సినిమా చూస్తుంటే సావిత్రి ఎంత బలహీనంగా ఉన్నారో మనకి ఇట్టే అర్థం అవుతుంది. ఈ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే ఆమె నటించారు. అదే సినిమాలో మెగాస్టార్ ఒక వేషం వేయడం ఆయన అదృష్టంగా భావిస్తారు. అలా ఆ భార్యాభర్తల్లో సావిత్రితో మొదటగా చిరంజీవి నటించారు.
ఒక రకంగా చెప్పాలంటే సావిత్రి సినిమా ప్రవేశానికి పరోక్షంగా జెమినీ గణేషన్ కూడా కారణంగా పేర్కొనవచ్చు. అలా సావిత్రి తన సినీ మొదటి ప్రయాణం లో చేదోడువాదోడుగా ఉన్న జెమినీ గణేషన్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆయన నిజ స్వరూపం తెలిసిన తర్వాత మెల్లిగా జెమినీ గణేషన్ నుంచి విడిపోవడానికి సావిత్రి ప్రయత్నించారు. ఆ క్రమంలో జెమినీ గణేషన్ స్త్రీలోలుడని ఆమె ఎంతగానో కృంగి పోయారు. ఆ సమయంలోనే సినిమాలు బాగా తగ్గిపోవడం దానితో ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యం కారణం వలన 1981 లోనే ఆమె మరణించారు.
ఆ తర్వాత 1988 లో నాగేంద్రబాబు నిర్మాతగా, కె.బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి, శోభన హీరో హీరోయిన్లుగా రుద్రవీణ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో హీరో చిరంజీవికి జెమినీ గణేష్ నాన్నగా బిలహరి గణపతిశాస్త్రి పాత్రను పోషించాడు. తండ్రీ కొడుకులుగా జెమినీ గణేషన్, చిరంజీవి నటించిన తీరు ప్రేక్షకులకు ఉద్విగ్న భరితంగా ఉంటుంది. రుద్రవీణ సినిమా అంతగా విజయం సాధించకపోయినా, ఓ కళాత్మక చిత్రంగా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.
ఈ సినిమాకు జాతీయ సమైక్యతా చిత్రంగా పురస్కారం దక్కింది. అలాగే హీరో చిరంజీవికి నంది పురస్కారం లభించగా, జాతీయ ఉత్తమ సంగీత దర్శకునిగా ఇళయరాజా అలాగే జాతీయ ఉత్తమ గాయకుడిగా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం లు జాతీయ అవార్డులు అందుకున్నారు. అలా.. సావిత్రి, జెమినీ గణేషన్ ల ఇద్దరితో నటించే అదృష్టం ఆయనకు దక్కిందని చిరంజీవి ఓ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు.
ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువతి, పెళ్లి రోజే రోడ్డు…
టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తన “పూరి మ్యూజింగ్స్” ద్వారా మరోసారి యువతకు ఆలోచింపజేసే సందేశాన్ని అందించారు. ఈసారి ఆయన…
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసాయి. పాకిస్థాన్ సూపర్…
దర్శకుడు వి. సముద్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్లో చేజారిపోయిన కీలక అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.…
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా మారిపోతాయో చెప్పే ఉదాహరణలు చాలానే ఉంటాయి. అలాంటి సంఘటనే ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది.…
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో జరుగుతున్న వివాదం చివరకు దారుణానికి దారి తీసి, ఓ పదో…