Featured

సౌందర్య ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బంగ్లా ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉందో తెలుసా..?

తెలుగు సినీ ప్రపంచాన్ని కొన్ని సంవత్సరాలపాటు ఏలిన అందాల నటి సౌందర్య హఠాత్మరణం ఇప్పటికి అందరిని కంట తడి పెట్టిస్తుంది. సావిత్రి తర్వాత టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన నటి ఎవరైనా ఉన్నారంటే ఆమె సౌందర్య మాత్రమె.. తెలుగు సినిమాలల్లో నటించడం మొదలు పెట్టి అనాది కాలంలోనే ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయితే ఆమెకు తోలిసారిగా వచ్చిన సినిమా అవకాశం కూడా చాలా విచిత్రంగా వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణతో “రైతు భారతం” అనే చిత్రం కోసం దర్శకుడు చిట్టిబాబు ప్లాన్ చేస్తున్న సమయంలో మొదట ఆ చిత్రానికి కధానాయికగా వాణి విశ్వనాథన్ ని అనుకున్నారు.

ఆ తరువాత అదే చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం మంచి నటి కావాలని వెతుకుతుండగా, రామయ్య అనే ఎడిటర్ డైరెక్టర్ చిట్టిబాబుకి ఫోన్ చేసి మీరు వెతుకుతున్న నటి బెంగళూరులో ఉందని చెప్పడం జరిగింది. అయితే డైరెక్టర్ చిట్టిబాబు మాత్రం ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా నేరుగా సౌందర్య ఇంటికి వెళ్లారు. అలా ఎటువంటి మేకప్ లేకుండా ఉన్న ఆమెను చూసి, ఆలస్యం చేయకుండా వెంటనే తన సినిమాలోని రెండో కధానాయిక పాత్రకు ఎంపిక చేసేసారు.

అలా సౌందర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఏ రేంజ్ కి ఎదిగిందో అందరికి తెలిసిందే. అప్పట్లో టాప్ హీరోలు అందరూ ఆమెతో నటించాలని భావించేవారట. సౌందర్య డేట్స్ ఖాళీ లేకపోయినా సరే వెయిట్ చేసి మరీ డేట్స్ ఆమెతో సినిమాలు చేసేవారు.

అందంతో పాటు అభినయం కలగలిసిన సౌందర్య తానూ నటించిన పాత్రల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగోట్టేది. ఇకపోతే సినియర్ నటి ఆమనీ తన స్నేహితురాలు సౌందర్య గురించి ఆమె ఇల్లు గురించి ఈ మధ్య ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బెంగళూరులో సౌందర్యకి ఒక సొంత ఇల్లు ఉండేది. ఇక ఇప్పుడైతే మరీ బూత్ బంగ్లా గా మారిపోయిందని, దానిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఇటీవలే అటువైపుగా వెళ్ళినపుడు చూశాను” అంటూ సౌందర్య ఆ ఇంట్లో ఉన్నప్పటి రోజులు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు ఆమని.

తను సౌందర్య మరణించిన తరువాత కొన్నాళ్లకు ఆ బంగ్లాకు వెళ్లానని, అక్కడ ఎవరూ లేరని ఆమని పేర్కొన్నారు. అయితే కొద్ది రోజుల కిందట వరకు సౌందర్య తల్లి అక్కడ ఉండేవారని ఆమెని కలుద్దామని అక్కడి వెళితే ఇప్పుడు అక్కడ ఎవరూ కనిపించలేదని, ఆ బంగ్లా పూర్తిగా పాతబడిపోయి చూడటానికి బూత్ బంగ్లాలా కనిపించినట్లు ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా సౌందర్య పేరుతో బయోపిక్ వస్తుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు నిత్యా మీనన్ పేరు కూడా వినిపిస్తుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రిలీఫ్ అనుకుంటున్నారా? టీతో స్మోకింగ్ మీ ప్రాణాలకు ముప్పే!

టీ విరామాల్లో సిగరెట్ కాల్చడం చాలామందికి చిన్న రిలీఫ్‌లా అనిపిస్తుంది. అయితే వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఈ…

6 hours ago

ద్విముఖ పోటీకి బ్రేక్.. తమిళనాడులో మూడో శక్తి ఆవిర్భావమా?

తమిళనాడు రాజకీయాల్లో ఈసారి వచ్చిన ఎన్నికల ఫలితాలు కొత్త చర్చలకు దారి తీశాయి. ప్రారంభ ట్రెండ్స్ నుంచే నటుడు విజయ్…

7 hours ago

2026లో హనుమాన్ జయంతి తేదీ ఫిక్స్.. భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు!

హిందూ సంప్రదాయంలో హనుమాన్ జయంతి ప్రత్యేక స్థానం కలిగిన పండుగ. అయితే ఈ ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా ఒకే రోజున జరుపుకోరు.…

9 hours ago

ఇంటి ముందు చెప్పులు ఇలా ఉంచితేనే అదృష్టం.. లేకపోతే కష్టాలే!

ఇంటి ప్రధాన ద్వారం కేవలం ప్రవేశద్వారం మాత్రమే కాదు, వాస్తు ప్రకారం అది సానుకూల శక్తి ప్రవాహానికి కీలకమైన మార్గంగా…

9 hours ago

శ్రీవారి అలంకరణలో స్టార్ పువ్వు ఇదే.. మీ ఇంట్లో విరగ పూయాలంటే ఈ టిప్స్!

ప్రకృతి అందాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన సువాసనభరిత పుష్పాల్లో సంపంగి ఒకటి. మాగ్నోలియా చంపాకా గా శాస్త్రీయంగా పిలిచే ఈ…

9 hours ago

గోపాలానంద స్వామి తాకితే కదిలిన విగ్రహం.. ఈ ఆలయం వెనుక అసలు కథ!

గుజరాత్ రాష్ట్రంలోని కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.…

9 hours ago