Featured

సౌందర్య ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బంగ్లా ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉందో తెలుసా..?

తెలుగు సినీ ప్రపంచాన్ని కొన్ని సంవత్సరాలపాటు ఏలిన అందాల నటి సౌందర్య హఠాత్మరణం ఇప్పటికి అందరిని కంట తడి పెట్టిస్తుంది. సావిత్రి తర్వాత టాలీవుడ్ ని ఏకచత్రాధిపత్యంగా ఏలిన నటి ఎవరైనా ఉన్నారంటే ఆమె సౌందర్య మాత్రమె.. తెలుగు సినిమాలల్లో నటించడం మొదలు పెట్టి అనాది కాలంలోనే ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయితే ఆమెకు తోలిసారిగా వచ్చిన సినిమా అవకాశం కూడా చాలా విచిత్రంగా వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణతో “రైతు భారతం” అనే చిత్రం కోసం దర్శకుడు చిట్టిబాబు ప్లాన్ చేస్తున్న సమయంలో మొదట ఆ చిత్రానికి కధానాయికగా వాణి విశ్వనాథన్ ని అనుకున్నారు.

ఆ తరువాత అదే చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం మంచి నటి కావాలని వెతుకుతుండగా, రామయ్య అనే ఎడిటర్ డైరెక్టర్ చిట్టిబాబుకి ఫోన్ చేసి మీరు వెతుకుతున్న నటి బెంగళూరులో ఉందని చెప్పడం జరిగింది. అయితే డైరెక్టర్ చిట్టిబాబు మాత్రం ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా నేరుగా సౌందర్య ఇంటికి వెళ్లారు. అలా ఎటువంటి మేకప్ లేకుండా ఉన్న ఆమెను చూసి, ఆలస్యం చేయకుండా వెంటనే తన సినిమాలోని రెండో కధానాయిక పాత్రకు ఎంపిక చేసేసారు.

అలా సౌందర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఏ రేంజ్ కి ఎదిగిందో అందరికి తెలిసిందే. అప్పట్లో టాప్ హీరోలు అందరూ ఆమెతో నటించాలని భావించేవారట. సౌందర్య డేట్స్ ఖాళీ లేకపోయినా సరే వెయిట్ చేసి మరీ డేట్స్ ఆమెతో సినిమాలు చేసేవారు.

అందంతో పాటు అభినయం కలగలిసిన సౌందర్య తానూ నటించిన పాత్రల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగోట్టేది. ఇకపోతే సినియర్ నటి ఆమనీ తన స్నేహితురాలు సౌందర్య గురించి ఆమె ఇల్లు గురించి ఈ మధ్య ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బెంగళూరులో సౌందర్యకి ఒక సొంత ఇల్లు ఉండేది. ఇక ఇప్పుడైతే మరీ బూత్ బంగ్లా గా మారిపోయిందని, దానిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఇటీవలే అటువైపుగా వెళ్ళినపుడు చూశాను” అంటూ సౌందర్య ఆ ఇంట్లో ఉన్నప్పటి రోజులు గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు ఆమని.

తను సౌందర్య మరణించిన తరువాత కొన్నాళ్లకు ఆ బంగ్లాకు వెళ్లానని, అక్కడ ఎవరూ లేరని ఆమని పేర్కొన్నారు. అయితే కొద్ది రోజుల కిందట వరకు సౌందర్య తల్లి అక్కడ ఉండేవారని ఆమెని కలుద్దామని అక్కడి వెళితే ఇప్పుడు అక్కడ ఎవరూ కనిపించలేదని, ఆ బంగ్లా పూర్తిగా పాతబడిపోయి చూడటానికి బూత్ బంగ్లాలా కనిపించినట్లు ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా సౌందర్య పేరుతో బయోపిక్ వస్తుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ కోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆమెతో పాటు నిత్యా మీనన్ పేరు కూడా వినిపిస్తుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పాదాల్లో తిమ్మిర్లు వస్తున్నాయా? ఇది విటమిన్ లోపం హెచ్చరిక కావచ్చు!

మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…

5 hours ago

బెండకాయలో దాగిన హెల్త్ పవర్… షుగర్ కంట్రోల్‌కు సూపర్ ఫుడ్!

వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…

5 hours ago

ఇంట్లో ఈ మూలలో నీళ్లు పెడితే… డబ్బు ప్రవాహం ఆగదు అంటున్నారు!

ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…

5 hours ago

రోజూ పిస్తా తింటున్నారా? ఈ లాభాలు తెలుసుకుంటే ఆశ్చర్యమే!

రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…

5 hours ago

చేతులు చూస్తేనే తెలిసిపోతుంది… మీ కొలెస్ట్రాల్ స్థాయి!

మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…

5 hours ago

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు… శ్రీశైలంలో చలివేంద్రాల ఏర్పాటు!

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…

5 hours ago