సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎవరివో ఒకరివి అండదండలు ఉండాలి. బంధువులో.. స్నేహితులో..అత్యంత సన్నిహితులో సినిమా ఇండస్ట్రీలో ఉంటే వారి ద్వారా ఇక్కడ దర్శకుడిగానో, హీరోగానో, రచయితగానో..లేక ఇతర 24 విభాగాలలో దేంట్లో ఒకదాంట్లో అవకాశం దొరికి ఎంట్రీ ఇవ్వడానికి వీలవుతుంది. అసలు ఎవరూ లేకపోతే ఇక్కడ ఎంట్రీ అంత సులభం కాదు. కానీ దర్శకుడు వంశీకి మాత్రం కాస్త సులభంగానే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరయ్యే అవకాశం దక్కింది. స్వతాహాగా ఆయన మంచి రచయిత. 16 ఏళ్ళకే రాయడం మొదలు పెట్టారు. అది కూడా ఆంధ్ర జ్యోతి పత్రికకు. ఇక్కడ పనిచేస్తున్న సమయంలో ఒకాయన నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు అని మద్రాసు(ఇప్పటి చెన్నై) కి తీసుకు వెళ్ళారు.
ఆయన మద్రాసు చేరుకునే సమయానికే పెద్ద పుస్తకాలు రెండు రాశారట. మంచు పల్లకి, కర్మ సాక్షి అనే పుస్తకాలు. ఈ రెండు తీసుకొని ఓ ప్రముఖ దర్శకుడు దగ్గరికి వెళితే ఆయనకి అనుమానం వచ్చిందట. ఇంత చిన్న కుర్రాడు ఇంత పెద్ద పుస్తకాలు ఎలా రాశాడు అని. ఆ డైరెక్టర్ వి మధుసూధన్ రావుగారు. ఆయనే వంశీకి మొట్టమొదటి గురువు. అయితే అన్ని పాత రెండు రూపాయల నోట్లు ఇచ్చి క్యాసినోలో ఫ్రెండ్స్ అనే సినిమా ఆడుతుంది. అదిచూసి వన్ లైన్ ఆర్డర్ వేసుకొని వారం తర్వాత కనపడమని చెప్పారట. ఆ సినిమా చూసి ఆయన చెప్పినట్టుగానే వన్ లైన్ ఆర్డర్ వేసి ఒక్కరోజులోనే తీసుకు వెళ్ళి కలిశారట.
అది చూసి షాకయిన మధుసూధన రావు గారు వెంటపెట్టుకొని ఎన్.టి.ఆర్ సినిమాకి జాయిన్ చేసుకున్నారట. అది ఆయన అసిస్టెంట్ గా మొదటి సినిమా. ఇక మొదటి క్లాప్ కొట్టింది సీనియర్ ఎన్.టి.ఆర్ మీద. అలా కొంతకాలం ఆయన దగ్గర పనిచేశారు. ఆఖరిగా భారతీ రాజా వద్ద పనిచేసి దర్శకుడయ్యారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా మంచు పల్లకి. ఇందులో చిరంజీవి సుహాసిని, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో వంశీకి చాలా మంచి పేరు తీసుకు వచ్చి వరుసగా అవకాశాలు వచ్చేలా క్రేజ్ దక్కింది.
ఈ సినిమా తర్వాత ఆలాపన సినిమా తీశారు. అన్వేషణ, సితార, లేడీస్ టైలర్, ప్రేమించు పెళ్ళాడు, డిటెక్టివ్ నారద, మహర్షి, చెట్టుకింద ప్లీడర్ లాంటి సినిమాలు చేశారు. అయితే ఒక సినిమా భారీ హిట్ అయితే ఆ తర్వాత రెండు సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. ఆ కారణమా లేక వేరేదా తెలీదు గానీ ఆయన మొత్తం కెరీర్ లో పెద్ద హీరోలతో చేసింది ఇద్దరితోనే. వారే చిరంజీవి, మోహన్ బాబు. ఇక ఇండస్ట్రీకి భానుప్రియను పరిచయం చేశారు. ఇక కె విశ్వనాథ్ లాంటి వారి దగ్గర పనిచేసినప్పటికి ఏ దర్శకుడి ప్రభావం ఆయన మీద పడలేదు. ఆయన నవల రాసినా, సినిమా తీసినా ఆయన మార్క్ మాత్రమే ఉంటుంది తప్ప.. ఇతర రచయిత, దర్శకుల ప్రభావం మాత్రం పడలేదు. చాలాకాలం తర్వాత రవితేజ – కళ్యాణి జంటగా నటించిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. మళ్ళీ ఆ స్థాయి హిట్ ఈ దర్శకుడికి దక్కలేదు. ఇక ఇండస్ట్రీ మొత్తంలో వంశీకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…