సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఎవరివో ఒకరివి అండదండలు ఉండాలి. బంధువులో.. స్నేహితులో..అత్యంత సన్నిహితులో సినిమా ఇండస్ట్రీలో ఉంటే వారి ద్వారా ఇక్కడ దర్శకుడిగానో, హీరోగానో, రచయితగానో..లేక ఇతర 24 విభాగాలలో దేంట్లో ఒకదాంట్లో అవకాశం దొరికి ఎంట్రీ ఇవ్వడానికి వీలవుతుంది. అసలు ఎవరూ లేకపోతే ఇక్కడ ఎంట్రీ అంత సులభం కాదు. కానీ దర్శకుడు వంశీకి మాత్రం కాస్త సులభంగానే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరయ్యే అవకాశం దక్కింది. స్వతాహాగా ఆయన మంచి రచయిత. 16 ఏళ్ళకే రాయడం మొదలు పెట్టారు. అది కూడా ఆంధ్ర జ్యోతి పత్రికకు. ఇక్కడ పనిచేస్తున్న సమయంలో ఒకాయన నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు అని మద్రాసు(ఇప్పటి చెన్నై) కి తీసుకు వెళ్ళారు.
ఆయన మద్రాసు చేరుకునే సమయానికే పెద్ద పుస్తకాలు రెండు రాశారట. మంచు పల్లకి, కర్మ సాక్షి అనే పుస్తకాలు. ఈ రెండు తీసుకొని ఓ ప్రముఖ దర్శకుడు దగ్గరికి వెళితే ఆయనకి అనుమానం వచ్చిందట. ఇంత చిన్న కుర్రాడు ఇంత పెద్ద పుస్తకాలు ఎలా రాశాడు అని. ఆ డైరెక్టర్ వి మధుసూధన్ రావుగారు. ఆయనే వంశీకి మొట్టమొదటి గురువు. అయితే అన్ని పాత రెండు రూపాయల నోట్లు ఇచ్చి క్యాసినోలో ఫ్రెండ్స్ అనే సినిమా ఆడుతుంది. అదిచూసి వన్ లైన్ ఆర్డర్ వేసుకొని వారం తర్వాత కనపడమని చెప్పారట. ఆ సినిమా చూసి ఆయన చెప్పినట్టుగానే వన్ లైన్ ఆర్డర్ వేసి ఒక్కరోజులోనే తీసుకు వెళ్ళి కలిశారట.
అది చూసి షాకయిన మధుసూధన రావు గారు వెంటపెట్టుకొని ఎన్.టి.ఆర్ సినిమాకి జాయిన్ చేసుకున్నారట. అది ఆయన అసిస్టెంట్ గా మొదటి సినిమా. ఇక మొదటి క్లాప్ కొట్టింది సీనియర్ ఎన్.టి.ఆర్ మీద. అలా కొంతకాలం ఆయన దగ్గర పనిచేశారు. ఆఖరిగా భారతీ రాజా వద్ద పనిచేసి దర్శకుడయ్యారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా మంచు పల్లకి. ఇందులో చిరంజీవి సుహాసిని, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో వంశీకి చాలా మంచి పేరు తీసుకు వచ్చి వరుసగా అవకాశాలు వచ్చేలా క్రేజ్ దక్కింది.
ఈ సినిమా తర్వాత ఆలాపన సినిమా తీశారు. అన్వేషణ, సితార, లేడీస్ టైలర్, ప్రేమించు పెళ్ళాడు, డిటెక్టివ్ నారద, మహర్షి, చెట్టుకింద ప్లీడర్ లాంటి సినిమాలు చేశారు. అయితే ఒక సినిమా భారీ హిట్ అయితే ఆ తర్వాత రెండు సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. ఆ కారణమా లేక వేరేదా తెలీదు గానీ ఆయన మొత్తం కెరీర్ లో పెద్ద హీరోలతో చేసింది ఇద్దరితోనే. వారే చిరంజీవి, మోహన్ బాబు. ఇక ఇండస్ట్రీకి భానుప్రియను పరిచయం చేశారు. ఇక కె విశ్వనాథ్ లాంటి వారి దగ్గర పనిచేసినప్పటికి ఏ దర్శకుడి ప్రభావం ఆయన మీద పడలేదు. ఆయన నవల రాసినా, సినిమా తీసినా ఆయన మార్క్ మాత్రమే ఉంటుంది తప్ప.. ఇతర రచయిత, దర్శకుల ప్రభావం మాత్రం పడలేదు. చాలాకాలం తర్వాత రవితేజ – కళ్యాణి జంటగా నటించిన అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. మళ్ళీ ఆ స్థాయి హిట్ ఈ దర్శకుడికి దక్కలేదు. ఇక ఇండస్ట్రీ మొత్తంలో వంశీకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ అనంతరం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గానే కనిపిస్తారు. ఈయన ఎప్పుడు కోప్పడిన సందర్భాలు కూడా లేవని చెప్పాలి. అయితే ప్రభాస్ ఏదైనా ఫ్రస్టేషన్లో ఉన్నప్పుడు లేదంటే సినిమాల విషయంలో కాస్త కంగారు పడినప్పుడు ఎవరిని కూడా కలవరట.
ప్రభాస్ ఏ విషయం గురించైనా కాస్త ఆలోచనలో ఉండి ఫ్రస్టేషన్ వస్తే కనుక తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా బయటకు పంపించేసి తలుపు గది వేసుకొని ఒక దమ్ము కొట్టేస్తారట అనంతరం తనకు నచ్చిన ఫుడ్ తిని ప్రశాంతంగా నిద్రపోతారని తెలుస్తుంది. ఇలా నిద్రపోయి లేచిన తర్వాత ఆయన ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయి ఫ్రెష్ మైండ్ తో బయటకు వస్తారట.
Advertisement
ఇష్టమైన ఫుడ్ తింటారు.. ఇలా ప్రభాస్ ఫ్రస్టేషన్ లో ఇలా వ్యవహరిస్తారని విషయం తెలిసి ప్రభాస్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ కోప్పడే సందర్భాలు చాలా తక్కువ అని ఆయనతో ఉన్నవాళ్లు చెబుతుంటారు ఆయన ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడుపుతూ ఉంటారని 99% తనకు కోపం అనేది రాదని తనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు పలు సందర్భాలలో వెల్లడించారు.
Nikhil siddarth: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి నటుడు నిఖిల్ సిద్ధార్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి నిఖిల్ ఇటీవల కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే ఈయన స్వయంబు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్వయంబు సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
త్వరలోనే స్వయంభూ సినిమా విడుదల తేదీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కుమారుడికి సంబంధించిన పలు విషయాలను కూడా నిఖిల్ అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల తనకు కుమారుడు జన్మించిన సంగతి మనకు తెలిసిందే. తన కుమారుడు జన్మించారనే విషయాన్ని తెలియజేయడమే కాకుండా తన కొడుకు బారసాల వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
Advertisement
పార్టీలకు వెళ్లడం మానుకున్న.. ఇలా బారసాల వేడుకలను నిర్వహించిన నిఖిల్ దంపతులు తమ కుమారుడికి ఏ పేరు పెట్టారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు అయితే తన కుమారుడికి ధీర సిద్ధార్థ్ అనే పేరు పెట్టినట్లు నిఖిల్ వెల్లడించారు. అయితే తన కొడుకు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. పిల్లలు సరైన వాతావరణంలో పెరగాలి అందుకు మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కొడుకు పుట్టిన తర్వాత నేను పార్టీలకు వెళ్లడం మానుకున్నానని తెలిపారు. వారంలో ఏదో ఒక రోజు తాను పార్టీకి వెళ్లే వాడినని ఇప్పుడు ఆ అలవాటు మార్చుకున్నాను అంటూ నిఖిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 700 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టించింది.
ఇక ఈ సినిమా థియేటర్లలోను అదేవిధంగా డిజిటల్ మీడియాలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 5:30కు స్టార్ మాలో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో సలార్ మేకర్స్ అద్భుతమైనటువంటి ఆఫర్ అభిమానులకు కల్పించారు. ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెబితే చాలు ఈ సినిమాలో ప్రభాస్ నడిపినటువంటి ఐకానిక్ మోటార్ సైకిల్ బైక్ మీ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Advertisement
క్విజ్ కాంటెస్ట్.. ఇలా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉండాలి అలాగే వారు పెట్టే కొన్ని కండిషన్స్ కూడా వర్తిస్తాయని వెల్లడించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి బైక్ మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఇలా మేకర్ ప్లాన్ చేశారు అంటే ఈ ఎఫెక్ట్ టి ఆర్ పి రేటింగ్ పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్లాన్స్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.