మూవీ మొఘల్ డా.డి. రామానాయుడు సినిమాల మీద ఆసక్తితో మద్రాసు వెళ్ళారు. ఆయన సొంత ఊరైన కారంచేడులో ‘నమ్మిన బంటు‘ సినిమా షూటింగ్ జరిగింది. ఆ సినిమాలోని ఎడ్లపందెం సన్నివేశాలు చిత్రీకరణ జరిగింది. అందులో రామానాయుడు కూడా ఒక సన్నివేశంలో నటించారు. అప్పుడే మీరు సినిమాల్లోకి రావచ్చు కదా.. అని అక్కినేని నాగేశ్వర రావు అడిగారు. ఇప్పుడు నాకు మా వ్యవసాయం తప్ప ఇంకో ఆలోచన లేదని చెప్పారు. రైసుమిల్లు వ్యాపారం మొదలు ఆ పనుల్లో పడ్డారు.
అయితే ఓసారి ఉన్నపలంగా సేల్స్-టాక్స్ వాళ్ళు వచ్చి, బిల్లులు రాయడం లేదని రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. అప్పట్లో రెండు లక్షలంటే ఎంత ఆస్తో ఊహించుకోవచ్చు. అయితే ఈ సంఘటన రామానాయుడికి వ్యాపారం మీద విరక్తి వచ్చేలా చేసింది. దాంతో నాయుడు గారు మిల్లు ముసివేసి, మద్రాసు వెళ్ళారు. అక్కడ మహాబలిపురం రోడ్డులో కొద్దిగా పొలం కొన్నారు. సాయంత్రం కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఆయన తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెల్తుండేవారు. అక్కడే సినిమావాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి.
తండ్రిని ఒప్పించి ‘అనురాగం’ చిత్రాన్ని నిర్మించారు.
ఓ సారి ‘అనురాగం’ చిత్రం మొదలు పెట్టాలని నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే కొద్దిగా పెట్టుబడి తగ్గడంతో ఆ సినిమాకి భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఈ విషయం రామానాయుడుకి తెలియడంతో ససేమిరా అన్నా పట్టుపట్టి తండ్రిని ఒప్పించి ‘అనురాగం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి జి.రామినీడు దర్శకత్వం వహించగా సూపర్ హిట్ అందుకుంది. అయితే అప్పుడు నాయుడుగారు సొంతగా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆయనే సొంతగా పెట్టుబడి పెట్టి నిర్మాతగా మారాలనుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థకి ఏ పేరు పెట్టాలి అని ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో పెద్దకొడుకు సురేష్ బాబుని హీరో చేయాలనుకున్నారు.
కానీ అందరు ఇంటికి పెద్దవాడు కాబట్టి భవిష్యత్తులో సురేష్ బాబు హీరోగా కంటే నిర్మాతని చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. రెండవ కొడుకు వెంకటేశ్ ని హీరో చేయాలని సలహాలిచ్చారు. నాయుడుగారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారందరు ఇదే సలహా ఇవ్వడంతో పెద్ద కొడుకు సురేష్బాబు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 1964లో ఎన్టీఆర్ హీరో గా ‘రాముడు-భీముడు‘ చిత్రాన్ని నిర్మించి సంచలన విజయాన్ని అందుకున్నారు. మొదటి విజయాన్ని అందుకున్న రామానాయుడు వరుసగా సినిమాలు నిర్మించారు. కానీ చుట్టుపక్కలవారిని విపరీతంగా నమ్మడంతో నష్టాల పాలైన ఆయన 1971లో ప్రేమ్నగర్ చిత్రాన్ని నిర్మించారు. ‘ప్రేమనగర్‘ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
టాలీవుడ్లో ఇప్పుడు సురేష్ బాబు నంబర్ వన్ ఫిల్మ్ మేకర్.
ఆ తర్వాత నుంచి సురేష్ ప్రొడక్షన్స్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. అంతేకాదు నాయుడు గారు మధ్యమధ్యలో కొన్ని సినిమాలలో కూడా నటించారు. అయితే అనుకున్నట్టు వెంకటేశ్ ని హీరోగా పరిచయం చేశారు. ఈ రోజు వెంకటేశ్ టాలీవుడ్లో స్టార్ హీరో. కానీ సురేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు వెండితెర మీద కనిపించింది లేదు. నాయుడుగారి తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు తన భుజాల మీద వేసుకున్నారు.
టాలీవుడ్లో ఇప్పుడు ఆయన నంబర్ వన్ ఫిల్మ్ మేకర్. కథ చెప్తే హీరో ఎవరో డిసైడ్ చేస్తారు. సీన్ చెప్తే లొకేషన్ ఏదైతే కరెక్ట్ గా ఉంటుందో దర్శకుడికి సూచిస్తారు. అంతేకాదు ఇప్పటి వరకు సురేష్ బాబు నిర్మాణంలో వచ్చిన సినిమాలకి ఓవర్ బడ్జెట్ అయింది లేదు. అంత పక్కాగా తన నిర్మాణ సంస్థను నడుపుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…