సూపర్ స్టార్ కృష్ణ అందాల శ్రీదేవి ఈ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. 1980 దశకంలో వచ్చిన వీరిద్దరి చిత్రాలు మంచి విజయాన్ని పొందాయి. శ్రీదేవి 1980 ప్రథమార్ధంలో తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించింది. 1979 లో ప్రారంభమైన వీరిద్దరి సినీ ప్రయాణం అనేక విజయవంతమైన సినిమాలతో ముందుకు వెళ్ళింది. 1979 విద్యాసాగర్ నిర్మాణం మస్తాన్ రావు దర్శకత్వంలో “బుర్రిపాలెం బుల్లోడు” చిత్రం విడులైంది. ఈ సినిమాలో కృష్ణ, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే వారు కలిసి అనేక చిత్రాల్లో నటించినప్పటికీ.. ఈ సినిమానే వారి కెరీర్ కు పునాది వేసిందని చెప్పవచ్చు.
ఈ చిత్రం గమ్మత్తుగా విడుదలై వంద రోజులు ప్రదర్శింపబడింది. ముందుగా మస్తాన్రావు విద్యాసాగర్ కలిసి ఓ హిందీ చిత్రం రీమేక్ హక్కులను తీసుకుందాం అనుకున్నారు. చివరికి ఆ బాలీవుడ్ నిర్మాతలు రీమేక్ హక్కులను ఇవ్వము అనడంతో, మస్తాన్ రావు ఒక స్టోరీ లైన్ చెప్పడంతో రచయితలు సత్యానంద్, జంధ్యాల కలిసి ఆ స్టోరీ లైన్ ని అభివృద్ధి చేశారు. ఆ కథను కృష్ణకు చెప్పడంతో ఆయన ఒప్పుకున్నారు. ఆ తర్వాత హిందీ రీమేక్ తీస్తే కృష్ణ, జయప్రదలను హీరో, హీరోయిన్లుగా సినిమా మొదలు పెడదామనుకున్నారు. కానీ జయప్రద “బుర్రిపాలెం బుల్లోడు” చిత్రం విషయం ఎటూ.. తేల్చకపోవడంతో అదే కథను శ్రీదేవికి చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారు. కానీ కృష్ణ, శ్రీదేవి డేట్స్ అడ్జస్ట్ కావడం చాలా కష్టమైంది. అయినప్పటికీ చాలా ఇబ్బందులతో సినిమాను పూర్తిచేశారు. అలా విడుదలై ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.
ఆ తర్వాత బంగారు భూమి, మహారాజశ్రీ మాయగాడు, కిరాయికోటిగాడు, వజ్రాయుధం, చుట్టాలున్నారు జాగ్రత్త వంటి విజయవంతమైన చిత్రాల్లో కృష్ణ, శ్రీదేవి కలిసి నటించారు. అయితే ఈ సినిమాల కన్నా ముందే శ్రీదేవి బాలనటిగా కృష్ణ సినిమాలో నటించడం జరిగింది. 1970 లో నందన్ రావు దర్శకత్వంలో మా “నాన్న నిర్దోషి” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో కృష్ణ విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా నటించారు. శ్రీదేవి ఇందులో బాలనటిగా కనిపించారు. 1970 మార్చిలో తాపీచాణక్య దర్శకత్వం లో “విధి విలాసం” అనే చిత్రం విడుదలైంది. ఇందులో కృష్ణ, విజయ నిర్మల హీరో హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరికీ కూతురిగా శ్రీదేవి నటించింది. అలా శ్రీదేవి.. కృష్ణ సినిమాలలో బాలనటిగా కనిపించి ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో ఆయన ప్రక్కన హీరోయిన్ గా నటించారు. అలా నటించి శ్రీదేవి తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…