Featured

హీరోయిన్ రంభ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ముగ్గురు పిల్లల తల్లైనా..!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకరు. అగ్ర హీరోలందరితో నటించిన అనుభవం ఆమెది. అందానికి తగ్గ అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. విజయవాడలో జన్మించిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. చిరుతో సమానంగా స్టెప్పులేసి అలరించింది.

అందుకే టాలీవుడ్ లో రంభ స్టార్  హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దశాబ్థ కాలం పాటు లీడింగ్ లేడీగా దూసుకుపోయింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాల,భోజ్ పూరి భాషల్లో నటించింది. రీసెంట్ గా తారక్, బన్నీ చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి మెరుపులు మెరిపించింది.

తెలుగు చిత్రరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రంభ 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్‌ను మ్యారేజ్ చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ మాజీ హీరోయిన్ 2016లో తన భర్త నుండి విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కడంతో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఈ కేసును పరిశీలించిన కోర్టు ఇద్దరూ కలిసి ఓ అవగాహనకు రావాలంటూ సూచన చేయడంతో ఇద్ద‌రు క‌లిసి కొత్త జీవితం గ‌డుపుతున్నారు. ఇక ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అషు రెడ్డి కేసులో భారీ ట్విస్ట్.. రూ.10 కోట్ల మోసం ఆరోపణలు

సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…

17 minutes ago

కామన్వెల్త్‌లో తెలుగు అమ్మాయి జోరు.. గోల్డ్, సిల్వర్‌తో చరిత్ర!

సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…

1 hour ago

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

10 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

10 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

10 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

10 hours ago