వాస్తవ కథలను ఈ మధ్య తెరకెక్కించడంలో చిత్ర దర్శక నిర్మాతలు ముందు ఉంటున్నారు. ఇటీవల దీని నేపథ్యంలో వచ్చిన సినిమా జై భీమ్. ఇది అమెజాన్ ఓటీటీలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సూర్య హీరోగా దీనిలో అద్భుతంగా నటించాడు.
ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడంతో వాస్తవ కథలను మంచిగా తీర్చిదిద్దితే ప్రేక్షకులు ఆదిరిస్తారు అనే దానికి ఇదే చక్కని ఉదాహరణ. ఇదిలా ఉండగా.. రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకొని.. డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ కథ అన్నీ కథలకంటే కాస్త బిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడదుల చేశారు. ఈ పోస్టర్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. శ్రీకాంత్ అయ్యంగార్, మోహన్, నవీన్ చంద్ర మూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వాళ్లు ముగ్గురు ఉండే విధంగా ఈ పోస్టర్ ను రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’ అంటూ సాగుతుంది. ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ పాటను సింగర్ మంగ్లీ పాడారు. దీనిని నవంబర్ 26న విడుదల చేస్తున్నట్లు.. దానికి సంబంధించిన రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు.
దీనికి కోటి స్వరాలను అందించడంతో పాటు.. ఈ సినిమా లో అతడు ఓ పాత్రను కూడా పోషించాడు.
ఈ చిత్రాన్ని ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ నిర్మించారు. దీనికి కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం డాక్టర్ మోహన్ వ్యవహరిస్తున్నారు. కెమెరా మెన్ గా చిట్టిబాటు, ఎడిటింగ్ గా నందమూరి హరి ఉన్నారు. బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు నటీనటులుగా ఉన్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…