Mega Family: 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పృధ్విరాజ్ గత ఎన్నికలలో భాగంగా వైసీపీ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. వైసిపి పార్టీ కోసం ఆయన పడిన కష్టాన్ని గుర్తించిన జగన్ ప్రభుత్వం ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో మంచి పదవి ఇచ్చారు.
అయితే పృథ్విరాజ్ చేసిన కొన్ని పనుల కారణంగా తనని ఆ పదవి నుంచి తొలగించారు. రాజకీయ పలుకుబడి ఉన్న కారణంతో ఆయన సినీ ప్రముఖులను తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే తనకు రాజకీయాలలో చేదు అనుభవం ఎదురవడంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరికి ఆయన క్షమాపణలు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా మెగా కుటుంబానికి పృధ్విరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. నేను వ్యతిరేక పార్టీ అని తెలిసినా కూడా చిరంజీవి గారు నాకు సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్ర ఇచ్చారు. ఇలా ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న నాకు ఎలాంటి గౌరవం ఇచ్చిన వీరందరిని అవమానించాను. నా అనుకున్న వాళ్లు నాకు వెన్నుపోటు పొడిచారని ఈ సందర్భంగా పృధ్వి రాజా వెల్లడించారు.
ఇక కరోనా వంటి విపత్కర సమయంలో నేను కరోనా బారినపడినప్పుడు నాకు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంచి ఆదరణ లభించిందని చాలామంది నాకు ధైర్యం చెప్పి పునర్జన్మ ఇచ్చారని పృథ్వీరాజ్ వెల్లడించారు. కరోనా నుంచి బయట పడిన తరువాత ఇలా తను అరుణాచలం వెళ్ళినప్పుడు ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు అందరితో కలిసి పోవాలని భావించానని అందుకే గతంలో నేను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ అందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. నేను ఒక్క అడుగు వేస్తే వారు నాకు వేయి అడుగులు వేయడానికి సహాయం చేస్తారని ఈ సందర్భంగా పృథ్విరాజ్ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…