Mega Family: 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సుమారు 200కు పైగా చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పృధ్విరాజ్ గత ఎన్నికలలో భాగంగా వైసీపీ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. వైసిపి పార్టీ కోసం ఆయన పడిన కష్టాన్ని గుర్తించిన జగన్ ప్రభుత్వం ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో మంచి పదవి ఇచ్చారు.
అయితే పృథ్విరాజ్ చేసిన కొన్ని పనుల కారణంగా తనని ఆ పదవి నుంచి తొలగించారు. రాజకీయ పలుకుబడి ఉన్న కారణంతో ఆయన సినీ ప్రముఖులను తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే తనకు రాజకీయాలలో చేదు అనుభవం ఎదురవడంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరికి ఆయన క్షమాపణలు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా మెగా కుటుంబానికి పృధ్విరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. నేను వ్యతిరేక పార్టీ అని తెలిసినా కూడా చిరంజీవి గారు నాకు సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్ర ఇచ్చారు. ఇలా ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న నాకు ఎలాంటి గౌరవం ఇచ్చిన వీరందరిని అవమానించాను. నా అనుకున్న వాళ్లు నాకు వెన్నుపోటు పొడిచారని ఈ సందర్భంగా పృధ్వి రాజా వెల్లడించారు.
ఇక కరోనా వంటి విపత్కర సమయంలో నేను కరోనా బారినపడినప్పుడు నాకు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంచి ఆదరణ లభించిందని చాలామంది నాకు ధైర్యం చెప్పి పునర్జన్మ ఇచ్చారని పృథ్వీరాజ్ వెల్లడించారు. కరోనా నుంచి బయట పడిన తరువాత ఇలా తను అరుణాచలం వెళ్ళినప్పుడు ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు అందరితో కలిసి పోవాలని భావించానని అందుకే గతంలో నేను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ అందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. నేను ఒక్క అడుగు వేస్తే వారు నాకు వేయి అడుగులు వేయడానికి సహాయం చేస్తారని ఈ సందర్భంగా పృథ్విరాజ్ వెల్లడించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…