దర్శకధీరుడు రాజమౌళి తీసే సినిమాలకు కథ అందించేది అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్..అయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటూ హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా సూపర్ హిట్ కథలను అందిస్తూ అయన పాన్ ఇండియా రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించినా అవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఇక ప్రస్తుతం RRR సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్లలో విడుదలకానుంది. ఈనేపధ్యంలో ఈ సినిమా ప్రమోషన్ల లో బిజీ బిజీగా గడుపుతున్నారు. RRR మేకర్స్.. విజయేంద్ర ప్రసాద్ కూడా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో పలు ఆశక్తికర విషయాలు చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్.
ఒక జర్నలిస్ట్ కులాల ప్రస్తావన తెస్తూ.. ఎన్టీఆర్ కమ్మ కులం.. రామ్ చరణ్ కాపు కులమని ఇలా కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయ తెరంగేట్రం చేస్తున్నారా? అంటూ ప్రశ్నిచారు. జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 1966లో తనకు పెళ్లి అయిందని.. తనది కమ్మ కులమని.. కానీ తన భార్య కులమెంటో తనకు అప్పుడు తెలియదని చెప్పారు. ఆసమయంలో తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, పెళ్లి సమయంలో ఆమె కులం ఏంటి అన్నది తనను ఎప్పుడూ అడగలేదని.. అసలు ఆ విషయమే తనకు తెలియదని చెప్పారు.
అయితే ఖైదీ సినిమా రిలీజ్ అయిన సమయంలో తను మా చిరంజీవి.. మా చిరంజీవి అని తను అనేదని.. అన్నారు. ఆమె అన్ని సార్లు అలా అంటుండటంతో ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి అడిగేసా.. “మాట్లాడితే మా చిరంజీవి అంటావ్ ఎందుకు” అని.. అప్పుడు ఆమే “మా ఇద్దరిదీ ఒకటే కులం” అని తన భార్య చెప్పిందని.. అందుకే మా చిరంజీవి అంటుందని తెలుసుకున్నానన్నారు. నిజం చెప్పాలంటే చిరంజీవి వలెనే తన భార్య కులం తనకి తెలిసిందని చెప్పారు విజయేంద్రప్రసాద్.
ఇక తమ కుటుంబంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లు ఎక్కువగా జరిగాయని.. మా ఇంట్లో అమ్మాయిలు కూడా ఇతర కులాల వారిని పెళ్లి చేసుకున్నారని చెప్పుకొచ్చారు. మా కుటుంబంలో ఎప్పుడూ కులాల ప్రస్తావన ఉండదని అలాంటిది కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం అనేది అసలు జరిగే చాన్స్ లేదని తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…