మల్లెమాల వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ మొదట్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా సుడిగాలి సుధీర్ యాంకర్ గా ఎంటర్ అవడంతో ఈ కార్యక్రమానికి అమాంతం క్రేజ్ పెరిగింది. జబర్దస్త్ కార్యక్రమం మాదిరిగానే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కూడా దూసుకుపోతోంది. ఈ షోలో భాగంగా సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించగా హైపర్ ఆది, గెటప్ శీను, సుధాకర్ వంటి జబర్దస్త్ కమెడియన్ తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. తాజాగా జులై 11 ఆదివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.
ఈ ప్రోమోలో హైపర్ ఆది, గెటప్ శీను, సుధాకర్ కమెడియన్లు చేసిన కామెడీ అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ఈ వారం కమెడియన్స్ అందరూ శ్రీమంతుడు సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకొనే కాన్సెప్టుతో చేశారు. ఈ కాన్సెప్ట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ శ్రీమంతుడు దర్శనమిచ్చాడు.పోరా శ్రీమంతుడా అంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పృథ్విరాజ్ వచ్చి రాగానే తనదైన శైలిలో పంచ్ లు వేసి అందరిని నవ్వించారు.
ఈ విధంగా స్టేజ్ పైకి వచ్చిన పృథ్విరాజ్ వచ్చీరాగానే…. ఆది… వెనక నుంచి వచ్చానని కంగారు పడ్డావా? అని అడగగా అందుకు ఆది” మీరు వెనక నుంచి వస్తారని మాకు తెలుసు…కానీ మా కోసం వస్తారు అని మాత్రం తెలియదు అంటూ” తనదైన శైలిలో పంచ్ వేశాడు. అయితే గతంలో పృథ్వి రాజ్ ఎస్వీబీసీ చైర్మన్గా చేసిన పృధ్విరాజ్ ఓ మహిళతో ఫోన్ కాల్ అసభ్యకరంగా మాట్లాడుతూ దొరికిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఫోన్ కాల్ లో భాగంగా పృద్విరాజ్ మహిళతో వెనుక నుంచి వచ్చి పెట్టుకుందాం అనుకున్నా అంటూ పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు లీక్ అవడంతో అప్పటినుంచి వెనకనుంచి పట్టుకొని పృథ్వి రాజ్ అయ్యాడు.అయితే ఈ వార్తలపై స్పందించిన పృథ్వీ రాజ్ కావాలని తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
ఈ విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమంలో ఓ స్కిట్లో భాగంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలోని ప్రజల సమస్యలను తీర్చి గ్రామ అభివృద్ధికి కృషి చేసే కాన్సెప్ట్ ద్వారా సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే వచ్చే వారం వరకు ఎదురు చూడాల్సిందే.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…