ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికి పోతున్నాయి.ఇలాంటి తరుణంలో ఇండియాలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే,జనవరి నెలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే మొదటిదశలో 60 సంవత్సరాలు పైబడిన వారికి, రెండో దశలో 45 సంవత్సరాలు పైబడిన వారికి, మూడో దశ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. అయితే దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా ఇలా కొత్త కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తూ భయాందోళనకి గురిచేస్తున్నాయి. ఈ వేరియంట్ల నుంచి రక్షణ పొందాలన్నా కూడా వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.కానీ ప్రస్తుతం మనదేశంలో కూడా వ్యాక్సిన్ కొరత ఉంది. ఈ కారణంగానే మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న 6 నుంచి 8 వారాల్లో ఇవ్వాల్సిన రెండో డోసును 12 వారాల తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో కోవిడ్ -19 కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకొని తయారుచేసిన ప్రస్తుత వ్యాక్సిన్ ఈ కొత్త వేరియంట్లు పైన సమర్థవంతంగా పని చేస్తుందా అనే అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం వైరస్ మ్యూటేషన్ ఇలాగే కొనసాగితే ప్రస్తుత వ్యాక్సిన్లు కూడా పనిచేయకపోవచ్చనని అలాంటి ప్రమాదకర పరిస్థితి రాకముందే సరైన సమయానికి రెండు వ్యాక్సిన్ డోసులు వేయించుకోవడం ముఖ్యమని,కొత్త వేరియంట్ల వ్యాప్తిని ఒక్క వ్యాక్సిన్ డోస్ అడ్డుకోవడం కష్టమని సూచిస్తోంది.కనుక నిర్ణీత గడువులోపు రెండు డోస్ ల వాక్సిన్ పూర్తి చేసుకొని,కొత్త వేరియంట్లను అడ్డుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…