సాధారణంగా విమాన ప్రమాదాలు సంభవిస్తే బతికి బయటపడటం చాలా చాలా అరుదైన విషయం. ఒకవేళ అలా బ్రతికితే వారికి అదొక పునర్జన్మ అని చెప్పవచ్చు. 99.9 శాతం మంది విమాన ప్రమాణాలలో బతకడం అసహజం. కానీ సుమారు 28 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఏకంగా 272 మంది బ్రతికి బయట పడ్డారు.అసలు ఇది కలలో కూడా ఊహించని విధంగా ప్రమాదం సంభవించడంతో వారందరూ బయటపడటం నిజంగా వారందరికీ ఒక పునర్జన్మ అని చెప్పవచ్చు.
272 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం కొన్ని సాంకేతిక సమస్యల వల్ల గాలిలోకి ఎగిరలేకపోయింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన నేపథ్యంలో ఒక వరి పొలాలలో ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి ప్రాణ నష్టం కలగకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన 60 మంది సినీ ప్రముఖులు ఇదే ఫ్లైట్ లో ఉండడం విశేషం.
వీరందరూ చెన్నై నుంచి హైదరాబాద్ బయలుదేరుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో మన టాలీవుడ్ స్టార్ హీరోస్ చిరంజీవి వెంకటేష్ విజయశాంతి అల్లురామలింగయ్య వంటి తదితర హీరోలు ఉండటం గమనార్హం. ఆ రోజు కనుక ఏమాత్రం తేడా జరిగిన ఈరోజు ఇండస్ట్రీలో ఇలాంటి స్టార్ హీరోలు ఉండేవారు కాదు. ప్రస్తుతం ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో గత 28 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…