సాధారణంగా విమాన ప్రమాదాలు సంభవిస్తే బతికి బయటపడటం చాలా చాలా అరుదైన విషయం. ఒకవేళ అలా బ్రతికితే వారికి అదొక పునర్జన్మ అని చెప్పవచ్చు. 99.9 శాతం మంది విమాన ప్రమాణాలలో బతకడం అసహజం. కానీ సుమారు 28 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఏకంగా 272 మంది బ్రతికి బయట పడ్డారు.అసలు ఇది కలలో కూడా ఊహించని విధంగా ప్రమాదం సంభవించడంతో వారందరూ బయటపడటం నిజంగా వారందరికీ ఒక పునర్జన్మ అని చెప్పవచ్చు.
272 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం కొన్ని సాంకేతిక సమస్యల వల్ల గాలిలోకి ఎగిరలేకపోయింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన నేపథ్యంలో ఒక వరి పొలాలలో ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి ప్రాణ నష్టం కలగకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన 60 మంది సినీ ప్రముఖులు ఇదే ఫ్లైట్ లో ఉండడం విశేషం.
వీరందరూ చెన్నై నుంచి హైదరాబాద్ బయలుదేరుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో మన టాలీవుడ్ స్టార్ హీరోస్ చిరంజీవి వెంకటేష్ విజయశాంతి అల్లురామలింగయ్య వంటి తదితర హీరోలు ఉండటం గమనార్హం. ఆ రోజు కనుక ఏమాత్రం తేడా జరిగిన ఈరోజు ఇండస్ట్రీలో ఇలాంటి స్టార్ హీరోలు ఉండేవారు కాదు. ప్రస్తుతం ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో గత 28 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…