సాధారణంగా విమాన ప్రమాదాలు సంభవిస్తే బతికి బయటపడటం చాలా చాలా అరుదైన విషయం. ఒకవేళ అలా బ్రతికితే వారికి అదొక పునర్జన్మ అని చెప్పవచ్చు. 99.9 శాతం మంది విమాన ప్రమాణాలలో బతకడం అసహజం. కానీ సుమారు 28 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఏకంగా 272 మంది బ్రతికి బయట పడ్డారు.అసలు ఇది కలలో కూడా ఊహించని విధంగా ప్రమాదం సంభవించడంతో వారందరూ బయటపడటం నిజంగా వారందరికీ ఒక పునర్జన్మ అని చెప్పవచ్చు.
272 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం కొన్ని సాంకేతిక సమస్యల వల్ల గాలిలోకి ఎగిరలేకపోయింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన నేపథ్యంలో ఒక వరి పొలాలలో ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి ప్రాణ నష్టం కలగకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన 60 మంది సినీ ప్రముఖులు ఇదే ఫ్లైట్ లో ఉండడం విశేషం.
వీరందరూ చెన్నై నుంచి హైదరాబాద్ బయలుదేరుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో మన టాలీవుడ్ స్టార్ హీరోస్ చిరంజీవి వెంకటేష్ విజయశాంతి అల్లురామలింగయ్య వంటి తదితర హీరోలు ఉండటం గమనార్హం. ఆ రోజు కనుక ఏమాత్రం తేడా జరిగిన ఈరోజు ఇండస్ట్రీలో ఇలాంటి స్టార్ హీరోలు ఉండేవారు కాదు. ప్రస్తుతం ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో గత 28 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…