తమిళనాడులోని నీలగిరి హిల్స్ లోఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా కెప్టెన్ మాత్రం వరుణ్ సింగ్ మాత్రం కొన ఊపిరితో బయటపడ్డారు. ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ ఆయన సతీమణి కూడా మృతి చెందారు. ఇదిలా ఉండగా కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కెప్టెన్ మెరుగైన వైద్య చికిత్స కోసం వెల్లింగ్ టన్ మిలిటరీ ఆస్పత్రికి తరలించారు.
మిల్లింగ్ టెన్ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయన ఎలాగైనా ప్రాణాలు నుంచి బయటపడాలని ఎంతోమంది ఆకాంక్షిస్తున్నారు. ఈయన చికిత్స చేయడం కోసం చెన్నై నుంచి ప్రముఖ వైద్యులు అక్కడి చేరుకున్నట్లు తెలుస్తోంది. వరుణ్ సింగ్ విషయానికి వస్తే ఈయన గత ఏడాది ఇలాంటి ప్రమాదం నుంచి తృటిలో తప్పి బయటపడ్డారని తెలుస్తుంది.
ఆయన నడుపుతున్నటువంటి విమానం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రమాదానికి గురైతే ఎంతో చాకచక్యంగా విమానం ల్యాండ్ చేశారని ఇతని ధైర్యసాహసాలకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డుతో సత్కరించింది. ఇక ఈ ప్రమాదంలో భాగంగా గాయాలపాలైన వరుణ్ సింగ్ సర్జరీ తర్వాత ఆయన తన భార్యతో మాట్లాడాలని భావించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈ ప్రమాదం జరిగే సమయంలో వరుణ్ సింగ్ భార్య ముంబైలో తన సోదరుడు ఇంట్లో ఉన్నారు. ప్రమాద విషయం తెలియగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన వెల్లింగ్ టన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఆయన ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి బయట పడాలని ఎంతోమంది ఆకాంక్షిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…