భారత సినీ పరిశ్రమ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన చనిపోయారు అంటే నమ్మ బుద్ధి కావడం లేదు.పునీత్ అకాల మరణం అతని కుటుంబ సభ్యులను, అతని అభిమానులను ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టేసింది. అతన్నికడసారిగా చూసేందుకు లక్షలాది మంది అభిమానులు కంఠీరవ స్టూడియో దగ్గరికి చేరుకుని అతనికి నివాళులు అర్పించారు.
అతని మరణ వార్త విని ఏకంగా ఒక అభిమాని గుండె పోటుతో మరణించాడు. పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంటే మరొకవైపు అతని మరణాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. బెంగుళూరు లోని ఒక డయాగ్నస్టిక్ సెంటర్ పునీత్ మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూనే అతని మరణాన్ని క్యాష్ చేసుకుంటోంది.
పునీత్ మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా అందరికీ గుండె అలాగే ఇతర చెకప్ లు ఫ్రీగా చేస్తాము అని ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. అయితే ఇంతవరకు బాగున్నా ఆ ఫ్లెక్సీ లో కిందవైపు మా వద్దకు బిపి, ఈసీజీ, క్రియాటిన్ లెవెల్స్, కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకుంటే కేవలం 300 రూపాయలు మాత్రమే అంటూ యాడ్ చేసింది.
దీంతో ఈ యాడ్ ఫై పునీత్ అభిమానులు పెద్ద ఎత్తున మండి పడుతున్నారు.ఈ యాడ్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మంచి మనిషి మరణాన్ని మీరు ఈ విధంగా క్యాష్ చేసుకుంటారా అంటూ పలువురు పెద్ద ఎత్తున డయాగ్నస్టిక్ సెంటర్ పైన విరుచుకుపడుతున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…