భారత సినీ పరిశ్రమ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తను ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన చనిపోయారు అంటే నమ్మ బుద్ధి కావడం లేదు.పునీత్ అకాల మరణం అతని కుటుంబ సభ్యులను, అతని అభిమానులను ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టేసింది. అతన్నికడసారిగా చూసేందుకు లక్షలాది మంది అభిమానులు కంఠీరవ స్టూడియో దగ్గరికి చేరుకుని అతనికి నివాళులు అర్పించారు.
అతని మరణ వార్త విని ఏకంగా ఒక అభిమాని గుండె పోటుతో మరణించాడు. పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంటే మరొకవైపు అతని మరణాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. బెంగుళూరు లోని ఒక డయాగ్నస్టిక్ సెంటర్ పునీత్ మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూనే అతని మరణాన్ని క్యాష్ చేసుకుంటోంది.
పునీత్ మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా అందరికీ గుండె అలాగే ఇతర చెకప్ లు ఫ్రీగా చేస్తాము అని ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. అయితే ఇంతవరకు బాగున్నా ఆ ఫ్లెక్సీ లో కిందవైపు మా వద్దకు బిపి, ఈసీజీ, క్రియాటిన్ లెవెల్స్, కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకుంటే కేవలం 300 రూపాయలు మాత్రమే అంటూ యాడ్ చేసింది.
దీంతో ఈ యాడ్ ఫై పునీత్ అభిమానులు పెద్ద ఎత్తున మండి పడుతున్నారు.ఈ యాడ్ కు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మంచి మనిషి మరణాన్ని మీరు ఈ విధంగా క్యాష్ చేసుకుంటారా అంటూ పలువురు పెద్ద ఎత్తున డయాగ్నస్టిక్ సెంటర్ పైన విరుచుకుపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…