భార్య వండిన చికెన్ బాగా వండలేదని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ భర్త. తర్వాత ఆమె శవాన్ని ఓ సరస్సులో పడేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాడు. ఐదు సంవత్సరాల క్రితం కర్ణాటకలోని దావణగెరె జిల్లాకు చెందిన 30 ఏళ్ల పాషా, 28 ఏళ్ల షరిన్ భాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అతడు బెడ్స్ అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఓ రోజు షరిన్ చెల్లి వాళ్ల ఇంటికి వచ్చింది. మరదలు వచ్చింది కదా అన్ని పాషా.. బయటకు వెళ్లి చికెన్ తీసుకొని వచ్చాడు. అయితే ఆమె దానిని ఫ్రై చేసింది. ఇంట్లో వాళ్లంతా కలిసి తింటున్న క్రమంలో చికెన్ మంచిగా వండలేదని.. ఇదేం వంట చేయడం అంటూ .. షరిన్ పై తన చెల్లి ముందే గొడవ పడ్డాడు.
పెళ్లి అయి ఇన్నాళ్లు అవుతున్నా వంట వండటం రాదా అంటూ ఆమెపై కస్సుబుస్సు అయ్యాడు. తన చెల్లి ముందే అతడు ఇన్ని మాటలు అన్నందకు షరిన్ బాగా బాధపడింది. తన చెల్లి ఉన్నన్ని రోజులు గొడవలు లేకుండా ఇద్దరు ఉన్నారు. ఆమె వెళ్లిన దగ్గర నుంచి మళ్లీ గొడవ పడటం మొదలు పెట్టారు.
ఓ రోజు పిల్లలు పడుకున్న సమయంలో మళ్లీ అతడు ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై బలంగా బాదాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమె శవాన్ని చిక్కబనవర లేక్లో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని మృతదేహం కోసం ఆ సరస్సులో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…