భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు, సామాన్యులపై నేరుగా భారంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సోమవారం డాలర్ మారకం విలువ వద్ద 90.78 వద్ద ముగిసిన రూపాయి, మంగళవారం మరింత బలహీనపడి 90.83 స్థాయికి చేరింది. ఇదే రూపాయి చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్థాయిగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొన్ని రోజులుగా రూపాయి పతనం ఆగకుండా కొనసాగుతుండటం ఆర్థిక నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో రానున్న రోజుల్లో రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ముఖ్యంగా దిగుమతులపై ఆధారపడే రంగాలపై పడనుంది.
రూపాయి బలహీనత కారణంగా విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇటీవల కేంద్ర ప్రభుత్వం 32 అంగుళాలకు మించిన టీవీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో ధరలు కొంత తగ్గాయి. అయితే రూపాయి పతనం కారణంగా ఆ ప్రయోజనం కొంతమేర తగ్గిపోయే పరిస్థితి నెలకొంది.
రూపాయి బలహీనత వెనుక పలు అంతర్జాతీయ, దేశీయ అంశాలు పనిచేస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ వాణిజ్య ఒప్పందం వచ్చే ఏడాది మార్చిలో పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటివరకు అనిశ్చితి కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
రూపాయి విలువ పతనం నేరుగా సామాన్య ప్రజల జీవనంపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, మొబైల్ సేవల ధరలు పెరగడం వల్ల ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. పరిస్థితులు ఎటువైపు మళ్లుతాయన్నది రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…