AaNaluguru Movie :కొన్ని సినిమాలు చూస్తుంటే మనమంత సినిమాలోని పాత్రలచే కలిసి ప్రయాణిస్తూంటాం. అందులో వచ్చే కొన్ని సీన్లు జీవితంలో మన చుట్టూ జరిగే సంఘటనలను గుర్తుచేస్తుంటాయి. పాత్రలకు వచ్చే బాధ ఆనందం ఏవైనా కావచ్చు కుర్చీలో కూర్చున్న మనమంతా కూడా వాటిని అనుభవిస్తుంటాం. కొన్ని సినిమాలు అసహజంగా నిజ జీవితానికి ఆమడ దూరంలో ఉంటే కొన్ని సినిమాలు సహజత్వం తో ప్రేక్షకులందరినీ అందులో ఇన్వాల్వ్ చేస్తుంటాయి.
కథా రచయిత మదన్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో చదువుకునే రోజుల్లో అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఓ వ్యక్తి ఊరంతా అప్పులు చేసి మరణించాడు. కానీ అంతిమయాత్రకు ఊరు ఊరంతా కదలి వచ్ఛారు. దీనిచే ప్రేరణ పొందిన మదన్ మదిలో మెదిలిన కథ అంతిమయాత్ర. ముందుగా ఈ కథతో సీరియల్ తీద్దామని కొన్ని ఎపిసోడ్స్ రాసుకున్నారు. కానీ ఎందుకనో వర్కవుట్ కాలేదు. ఆ కథను ప్రముఖ నటుడు రచయిత భాగ్యరాజా గారికి వినిపించారు. ఆ కథలోని రఘురాం పాత్రను నేనే చేస్తానంటూ కథ తనకు కావాలని భాగ్యరాజా అడిగాడు. అందుకు మదన్ టీం నిరాకరించింది.
ఎట్టకేలకు చిట్టచివరికి ఆ నలుగురు సినిమా చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కింది. అంతిమయాత్ర కాస్త ఆ నలుగురు గా మార్చారు. ఈ సినిమాలో రఘురాం అనే ముఖ్య పాత్ర కోసం దాసరి, మోహన్ బాబు, ప్రకాష్ రాజు లను సంప్రదించారు. చివరికి రాజేంద్ర ప్రసాద్ ను తీసుకున్నారు.రాజేంద్రప్రసాద్ కు జోడీగా లక్ష్మి, భానుప్రియ, గౌతమి, రోజా అనుకున్నారు. కానీ చివరికి ప్రముఖ హీరోయిన్ ఆమని గారిని సెలెక్ట్ చేశారు.
2004లో విడుదలైన ఆ నలుగురు సినిమా పోస్టర్ చాలా డల్ గా ఉంది.స్టార్ హీరోలు ఎవరు కూడా కనిపించడం లేదు. వయసుమళ్ళిన పాత్ర లో రాజేంద్రప్రసాద్ కనబడుతున్నారు. ఇంకేముంది థియేటర్ కి వెళ్లి చూస్తే నలుగురు మాత్రమే ఉన్నారు. దర్శక నిర్మాతలు నిరాశ చెందారు. అలా రెండు వారాలు గడిచిన తర్వాత మూవి బాగుందనడంతో సినిమా హాల్ కు ఒక్కొక్కరుగా రావడం మొదలు పెట్టారు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సినిమాకి కాసుల వర్షం కురిసింది.
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటిని ఎప్పుడు తింటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో…
వేసవి వచ్చేసరికి ప్రతి ఇంట్లో ఫ్యాన్లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. అయినప్పటికీ కొన్ని రోజుల్లోనే ఫ్యాన్ రెక్కలపై నల్లటి దుమ్ము…
వేసవి కాలంలో శరీరంలో వేడి పెరగడం సహజం. అందుకే ఈ సీజన్లో చల్లదనాన్ని ఇచ్చే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు…
ఉత్తరాఖండ్లో జరిగిన ఒక విచిత్ర వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సంప్రదాయాలకు విరుద్ధంగా, ఒక జంట శ్మశాన వాటికలో…
వేసవి కాలం మొదలైతే చల్లని పానీయాల వైపు అందరూ మొగ్గు చూపుతారు. ముఖ్యంగా చెరకు రసం, కొబ్బరి నీరు వంటి…
నేటి జీవనశైలిలో గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…