మంచి అభిరుచిగల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. చిన్నప్పుడు అనేక నాటకాల్లో నటించారు. నాటకాలపై ఆసక్తిని గమనించిన వి.బి.రాజేంద్రప్రసాద్ ఆయనను మొదటగా “అన్నపూర్ణ” చిత్రంలో ఒక వేషం వేయడానికి మద్రాస్ తీసుకువెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ సినిమాలో అవకాశం దొరకలేదు. ఆ తర్వాత డబ్బింగ్ కళాకారుడిగా “పార్వతీ కల్యాణం” చిత్రంలో శివుడి పాత్రకు ఏడిద నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమాకు 500 రూపాయల పారితోషికం లభించింది. ఆ తర్వాత “నేరముశిక్ష” మానవుడు-దానవుడు లాంటి చిత్రాల్లో ఆయన నటించారు. నేరముశిక్ష చిత్రంలో నటించడంతో కె.విశ్వనాథ్ ఆయనకు పరిచయమయ్యారు.
ఏడిద నాగేశ్వరరావు ‘సిరిసిరిమువ్వ” చిత్రాన్ని మొదటిసారిగా నిర్మించారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో తన బంధువులతో కలిసి “పూర్ణోదయ మూవీ క్రియేషన్స్” అనే బ్యానర్ ను స్థాపించారు. ఆ తర్వాత శంకరాభరణం, సీతాకోకచిలుక, సితార, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల స్వయంకృషి, ఆపద్బాంధవుడు చిత్రాలు నిర్మించారు.
చిరంజీవి-పూర్ణోదయ క్రియేషన్స్ కాంబినేషన్ లో రెండవ సినిమా.. కె.విశ్వనాథ్-చిరంజీవి కలయికలో మూడవ చిత్రం “ఆపద్బాంధవుడు. 1992 ఏడిద నాగేశ్వరరావు నిర్మాణం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో “ఆపద్బాంధవుడు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, మీనాక్షిశేషాద్రి హీరో,హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో కవి, ఉపాధ్యాయుడిగా జంధ్యాల ప్రధాన పాత్రను పోషించారు. కళా దర్శకుడు విశ్వనాథ్ ఆస్థానకవిగా “సిరిసిరిమువ్వ” చిత్రం నుంచి పనిచేస్తున్న జంధ్యాలకి ఈ సినిమాలోని మీనాక్షిశేషాద్రి తండ్రి పాత్ర బాగా నచ్చడంతో.. కథా చర్చలు విశ్వనాధ్-జంధ్యాల మధ్య నడుస్తున్న.. ఆ పాత్ర తాను వేస్తానన్న విషయాన్ని మొహమాటంతో చెప్పలేకపోయాడు.
చివరికి ఆ పాత్ర పోషిస్తాననన్న విషయాన్ని ఒక కాగితంపై రాసి విశ్వనాధ్ కు పంపించారు. అది చదివిన కె.విశ్వనాథ్ నవ్వుకొని అందులోని కవిగా జంధ్యాల అయితే బాగుంటుందని.. సరే అని ఒప్పుకున్నారు. నిజంగా జంధ్యాల ఆ పాత్రకు ప్రాణం పోశారని చెప్పవచ్చు. ఇకపపోతే చిరంజీవి పరిపక్వతతో కూడిన నటనను అత్యంత సహజసిద్ధంగా పోషించారని చెప్పవచ్చు. చిరంజీవి మీనాక్షిశేషాద్రి మధ్య వచ్చే “ఔరా అమ్మక చెల్లా… ఆలకించి నమ్మడం మెల్లా”.. అనే గీతం అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందినప్పటికీ పురస్కారాల వర్షాన్ని కురిపించింది.
ఉత్తమ నటుడిగా చిరంజీవి, ఉత్తమ నిర్మాతగా ఏడిద నాగేశ్వరరావు.. ఉత్తమ దర్శకుడిగా కె.విశ్వనాథ్.. ఉత్తమ సంభాషణల రచయితగా జంధ్యాల.. ఉత్తమ నృత్య దర్శకుడుగా భూషణ్.. ఉత్తమ కళా దర్శకుడుగా చలం.. నంది పురస్కారాలను అందుకున్నారు. “ఆపద్బాంధవుడు” చిత్రం ప్రేక్షకుల తిరస్కారానికి గురైనా.. నందుల పురస్కారాలను అందుకుంది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…