Aata Sandeep: డాన్స్ మాస్టర్ చైతన్య ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి అందరికీ తెలిసింది. ఆత్మహత్యకు ముందు చైతన్య మాస్టర్ ఒక వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో తాను అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. అయితే ఆయన మరణానికి ఢీ షో నిర్మాతలే కారణమని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఢీ షో లో కొరియోగ్రాఫర్లకి సరైన రెమ్యూనరేషన్ ఇవ్వటం లేదని, అందువల్ల కొరియోగ్రాఫర్లు బయట అప్పులు చేసి డాన్సర్లకు డబ్బులు ఇస్తూ వారు అప్పుల పాలవుతున్నారని తెలుపుతున్నారు. తాజాగా చైతన్య మాస్టర్ మరణం గురించి ఆట సేమ్ సందీప్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చైతన్య మాస్టర్ చనిపోవడానికి ఢీ షో నిర్మాతలే పరోక్షంగా కారణమని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఢీ షో లో ఒక్కో పాటకి 30,000 మాత్రమే రెమ్యూనరేషన్ ఇస్తారని, ఆ డబ్బుతోనే డాన్సర్లకు కాస్ట్యూమ్స్ వల్లి ట్రావెలింగ్ చార్జెస్ డాన్సర్లకు ఫుడ్ అలాగే డాన్సర్లకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని సందీప్ వెల్లడించాడు. అయితే ఢీ నిర్మాతలు ఇచ్చే 30000 సరిపోక బయట అప్పులు చేసి మరి డాన్సర్లకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని సందీప్ వెల్లడించాడు.
అంతేకాకుండా జబర్దస్త్ కమెడియన్లకు ఇచ్చి రెమ్యూనరేషన్ తో పోలిస్తే ఢీ లో కొరియోగ్రాఫర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువ అని తెలిపాడు.
కష్టం అంతా డాన్సర్స్ దే అయినప్పటికీ డాన్సర్స్ ని చిన్న చూపు చూస్తారు. డబ్బుల విషయంలో బేరాలు ఆడతారు అని సందీప్ వెల్లడించాడు. చైతన్య మాదిరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్స్, డాన్సర్స్ ఎంతో మంది ఉన్నారు. ఢీ షోలో పని చేసే డాన్సర్స్ కి కనీస గౌరవం, సంపాదన లేదని ఆట సందీప్ నేరుగా చెప్పారు. చైతన్య సూసైడ్ చేసుకోవడానికి ముందు వీడియోలో కూడా ఇదే మెల్లడించాడు. ఢీ షో వల్ల పేరు ప్రఖ్యాతలు వస్తాయి కానీ ఆదాయం ఉండదు అని తెలిపాడు.
సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…