Allari Naresh: ప్రముఖ నిర్మాత ఈవివి సత్యనారాయణ వారసుడిగా అల్లరి సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన నరేష్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని ఆ సినిమా పేరుని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 60 కి పైగా కామెడీ సినిమాలలో నటించి కామెడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
దాదాపు కొన్ని సంవత్సరాల పాటు నరేష్ కి సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత నాంది సినిమాలో డిఫరెంట్ పాత్ర ద్వారా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వైవిద్యమైన పాత్రలో నరేష్ హీరోగా నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఉగ్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి నరేష్ సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా మే ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్ సినిమా విశేషాలతో పాటు మరొక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. అల్లరి నరేష్ నటించిన సినిమాలలో సుడిగాడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.అయితే ఆ సినిమా సీక్వెల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట పెట్టాడు.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లరి నరేష్.. తన సినిమాల సీక్వెల్ గురించి మాట్లాడుతూ..
“తాను నటించిన సుడిగాడు సినిమా సీక్వెల్ చేస్తే బాగుంటుందని తెలిపాడు. అంతేకాకుండా ఆ సమయంలో ప్రస్తుతం దర్శకుడుగా మంచి గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి ఆ సినిమా కోసం పని చేశాడని, ఆయనే స్వయంగా సుడిగాడు సీక్వెల్ తీద్దామా అని అడిగినట్లు నరేష్ చెప్పుకొచ్చాడు. నేను రూటు మార్చితే మళ్ళీ కామెడీ వైపు తీసుకెళ్తారా అని అడిగితే ఆయన ఓకే అన్నాడు అని నరేష్ తెలిపారు. అయితే నరేష్ మళ్లీ కామెడీ వైపు వెళ్లి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నరేష్ సుడిగాడు 2 సినిమా చేస్తాడా? లేదా? అని అభిమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…