Aata Sandeep & Jyothi : ఓంకార్ తెలుగు రియాలిటీ షోలలో సంచలనం. ఆట, మాయాద్వీపం వంటి షోలతో బాగా పాపులర్ అయిన ఓంకార్ ఆ తరువాత సినిమాలను కూడా తీస్తున్నారు. అయితే ఆయన ఆట డాన్స్ షో ద్వారా చాలా మంది కొరియోగ్రాఫర్లుగా సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. మొదట్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వీళ్లంతా ఇపుడు అవకాశాలు లేక ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. అయితే యూట్యూబ్ ఛానల్ ద్వారా డాన్స్ వీడియోలు పెడుతూ మళ్ళీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆట సందీప్, జ్యోతి రాజ్. వీరిద్దరూ త్వరలో ఒక సినిమాలో కూడా కనిపించబోతున్నారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తమ లైఫ్ స్ట్రగల్స్ గురించి ఈ జంట పంచుకున్నారు.
డబ్బు లేక అవస్థలు…
ఆట టైటిల్ విన్నర్ అయిన సందీప్ ఆ షో తరువాత డాన్సర్ జ్యోతి రాజ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆట షోకి మంచి పాపులరిటీ ఉండటం వల్ల వెంటనే వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నా పెద్దగా సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఇక బాబు పుట్టాక ఒకరోజు అవకాశల కోసం సురేష్ ప్రొడక్షన్స్ కి వెళ్లి తిరిగి బండి మీద వెళ్తుంటే పెట్రోల్ అయిపోగా పెట్రోల్ కొట్టించడానికి అని బంక్ వద్దకు వెళ్ళి జేబులో చూసుకుంటే డబ్బులు లేవట. ఇక ఫోన్ చేసి ఎవరికైనా చెబుదామంటే ఫోన్ లో కూడా డబ్బులు లేవట, ఆరోజు చాలా బాధేసి రోడ్డుపక్కన బైక్ మీద కూర్చొని బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట సందీప్.
తాను సినిమాలంటూ వెళ్తే కుటుంబం పరిస్థితి ఏమిటి అని అలోచించి ముందు ఆర్థికంగా సెటిల్ అయి అపైన సినిమాల్లోకి రావాలని అనుకున్నారట. అలా కెరీర్ ను పక్కన పెట్టి ముందు ఆర్థికంగా సెటిల్ అయ్యారట. ఇక జ్యోతి రాజ్ కూడా మాట్లాడుతూ తన పెళ్లి, వెంటనే బాబు పుట్టడం, చిన్న వయసులో ఇదంతా జరగడంతో బాగా లావుగా మారిపోయి డాన్స్ చేయలేనని బాధపడ్డాను అంటూ చెప్పారు. మళ్ళీ డాన్స్ చేయాలని చాలా అనిపించింది కానీ ఒకవైపు అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులను పడ్డాను. కానీ నా భర్త పక్కన మళ్ళీ డాన్స్ చేయాలని అనుకున్నా. ఈ రోజుకు అది మళ్ళీ కుదిరింది అంటూ తమ జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…