Featured

ఇంట్లో లెటర్ పెట్టి మరీ..10 కేజీల బంగారంతో పరారయిన వ్యక్తి..!

ప్రస్తుతం బంగారానికి ఎంత రేటు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్లు బంగారం పెట్టుబడి పెట్టి.. అవసరం ఉన్నప్పుడు విక్రయిస్తుంటారు. అయితే ఒకప్పుడు బంగారాన్ని తయారు చేసేందుకు.. బంగారం తయారు చేసే కులస్తులకు ఇచ్చి వాటికి కూలీ ఇచ్చి కస్టమర్లకు ఇచ్చేవారు వ్యాపారస్తులు. అయితే ఇలాగే ఓ వ్యక్తికి బంగారు ఆభరణాలు తయారు చేయాలని 10 కేజీల బంగారాన్ని ఇచ్చారు వ్యాపారస్తులు.

అంత బంగారాన్ని చూసిన సదరు వ్యక్తి ఆశ పుట్టిందో .. లేక మరేదైనా కారణం కావావచ్చో ఏమో గానీ ఇంట్లో ఓ లేఖ పెట్టి 10 కేజీల బంగారంతో ఉడాయించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఈ విధంగా చెప్పారు. ఈ ఘటనపై తొమ్మిది మంది వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఓ లెటర్ కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది. విజయవాడ బస్టాండ్ లో బంగారంతో ఉన్న బ్యాగ్ పోయిందని అందులో రాసి అతడు ఇంట్లో నుంచి పరారయ్యాడు. అయితే ఈ లేఖపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అతడే బంగారాన్ని తీసుకొని పారిపోయి కేసును తప్పదోవ పట్టించేందుకే ఇలా చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారయిన వ్యక్తి పేరు దిలీప్ కుమార్ గా పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago