ప్రస్తుతం బంగారానికి ఎంత రేటు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్లు బంగారం పెట్టుబడి పెట్టి.. అవసరం ఉన్నప్పుడు విక్రయిస్తుంటారు. అయితే ఒకప్పుడు బంగారాన్ని తయారు చేసేందుకు.. బంగారం తయారు చేసే కులస్తులకు ఇచ్చి వాటికి కూలీ ఇచ్చి కస్టమర్లకు ఇచ్చేవారు వ్యాపారస్తులు. అయితే ఇలాగే ఓ వ్యక్తికి బంగారు ఆభరణాలు తయారు చేయాలని 10 కేజీల బంగారాన్ని ఇచ్చారు వ్యాపారస్తులు.

అంత బంగారాన్ని చూసిన సదరు వ్యక్తి ఆశ పుట్టిందో .. లేక మరేదైనా కారణం కావావచ్చో ఏమో గానీ ఇంట్లో ఓ లేఖ పెట్టి 10 కేజీల బంగారంతో ఉడాయించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఈ విధంగా చెప్పారు. ఈ ఘటనపై తొమ్మిది మంది వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఓ లెటర్ కనిపించింది. అందులో ఇలా రాసి ఉంది. విజయవాడ బస్టాండ్ లో బంగారంతో ఉన్న బ్యాగ్ పోయిందని అందులో రాసి అతడు ఇంట్లో నుంచి పరారయ్యాడు. అయితే ఈ లేఖపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అతడే బంగారాన్ని తీసుకొని పారిపోయి కేసును తప్పదోవ పట్టించేందుకే ఇలా చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారయిన వ్యక్తి పేరు దిలీప్ కుమార్ గా పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.































