మనం ప్రతి రోజు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటాము. అయితే మనం చేసుకున్న ఆహార పదార్థాలు మనకు రుచి కలిగి ఉండాలంటే తప్పనిసరిగా అందులోకి ఉప్పు వేయాల్సిందే. తగినంత మోతాదులో ఉప్పు లేకపోతే ఆ ఆహారపదార్థాలకు ఎలాంటి రుచి ఉండదు. ఆహార పదార్థాలకు రుచి రావాలంటే తప్పనిసరిగా ఉప్పు వేయాల్సిందే. అయితే సరైన మోతాదులో ఉప్పు వాడటం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. కానీ మితిమీరి ఉప్పును వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి.ఈ క్రమంలోనే అధిక శాతం ఉప్పు వాడటం వల్ల మనలో కొన్ని లక్షణాలు తలెత్తుతాయి.అయితే ఈ లక్షణాలు కనుక మీలో కనిపిస్తున్నాయంటే తప్పకుండా మీరు అధికంగా ఉప్పును తీసుకున్నట్లే. మరి ఆ లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా సరైన మోతాదులో ఉప్పు తీసుకునే వారితో పోలిస్తే కొంచెం అధిక మోతాదులో తీసుకునే వారు రోజుకు రెండు నుంచి మూడు నాలుగు సార్లు మూత్ర విసర్జనకు వెళ్తారు.ఈ విధంగా మూత్రవిసర్జనకు వెళుతూ అధిక మొత్తంలో నీటిని తీసుకుంటూ ఉంటే తప్పకుండా మీరు అధిక మోతాదులో ఉప్పును ఉపయోగిస్తున్నారని అర్థం. ఈ క్రమంలోనే ఉప్పును తగ్గించడం వల్ల మూత్ర విసర్జన సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
చాలామందికి కాలి మడమల దగ్గర వాపులు కనిపిస్తాయి.అయితే ఆ వాపు పై మనం వేలితో నొక్కి నప్పుడు మెత్తగా చర్మం లోపలికి వెళుతుంది.ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడుతుంటే మీరు ఉప్పును అధికంగా తీసుకుంటున్నట్లు అని అర్థం. అదేవిధంగా మరికొందరు ఎనీమియా వ్యాధితో బాధపడే వారిలో కూడా చర్మంలో అక్కడక్కడ నీరు చేరి చర్మం ఎంతో మెత్తగా ఉబ్బినట్లు కనబడుతుంది.
ప్రతి రోజు వారి ఆహారంలో భాగంగా ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరం వెంటనే డీహైడ్రేషన్ కు గురి అవుతుంది.ఈ క్రమంలోనే ఎక్కువగా నీటిని తాగాలి అనే కోరిక కలుగుతుంది. ఇలాంటి కోరిక మీలో కలిగితే మీరు ఉప్పును అధికంగా తీసుకుంటున్నారని నిపుణులు తెలుపుతున్నారు.అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే మన ఆహారంలో క్రమంగా ఉప్పును తగ్గించడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…