దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల నిరుద్యోగులైన సంగతి తెలిసిందే. కేంద్రం ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు ప్రయోజనం చేకూర్చడం కోసం అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఈఎస్ఐ నుంచి కరోనా, లాక్ డౌన్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు నిరుద్యోగ భృతిని పొందే అవకాశం ఉంటుంది.
ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునేవాళ్లు https://www.esic.in/ వెబ్ సైట్ లోకి లాగ్ ఇన్ కావాలి. అనంతరం ఏబీవీకేవై క్లెయిమ్ అనే విభాగాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత నిరుద్యోగ భృతిని ఎప్పటినుంచి ఎప్పటివరకు పొందాలనే అంశం గురించి ఎంచుకోవాలి. ఆ తర్వాత ఏబీ–1 ఫామ్ ప్రింట్ తీసుకొని 20 రూపాయల స్టాంప్ పేపర్ పై నోటరీ చేయించి నిరుద్యోగ కాల వివరాలను పొందుపరచాలి. ఆ ఫామ్ పై దరఖాస్తుదారు సంతకం చేయాలి.
అనంతరం ఏబీ 2 అనే ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకొని ఆ ఫామ్ కంపెనీ యాజమాన్యంతో సంతకం చేయించాలి. యజమాన్యం ధృవీకరించని పక్షంలో పీఎఫ్ నంబర్ ను ఈఎస్ఐ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఈఎస్ఐ కార్డును అఫిడవిట్ కు జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు ఉద్యోగం లేకపోతేనే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
రెండు సంవత్సరాలపాటు కనీసం సంస్థల్లో పని చేసిన వాళ్లు మాత్రమే నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యాజమాన్యాలు ధృవీకరించని పక్షంలో ఈఎస్ఐ కార్యాలయంలో సంప్రదించి వివరలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…