ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మినహా మరో మార్గం లేదనే సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ప్రజలకు రష్యా కరోనా వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. స్పుత్నిక్ వి పేరుతో రష్యా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా వ్యాక్సిన్ భారతదేశానికి చేరింది.
రెడ్డి ల్యాబ్స్ ఈ కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను మొదలుపెట్టింది. రష్యా కరోనా వ్యాక్సిన్ పై ఇప్పటికే తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా ఈ క్లినికల్ ట్రయల్స్ లో రష్యా కరోనా వ్యాక్సిన్ మంచి ఫలితాలను అందుకుంది. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి రెడ్డీస్ ల్యాబ్స్ సిద్ధమైంది.
చాలా నెలల క్రితమే రష్యా కరోనా వ్యాక్సిన్ ను విడుదల చేయగా ఆ వ్యాక్సిన్ 92 శాతానికి పైగా సమర్థవంతంగా పని చేస్తుందని రష్యా నుంచి ప్రకటన వెలువడింది. రెండు రోజుల క్రితం ఫైజర్ సంస్థ తమ కరోనా వ్యాక్సిన్ 90 శాతానికి పైగా సమర్థవంతంగా పని చేస్తుందని కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో రష్యా తమ వ్యాక్సిన్ కూడా సమర్థవంతంగా పని చేస్తుందని చెబుతోంది.
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తుదిదశ క్లినికల్ ట్రయల్స్ లో కూడా సక్సెస్ అయితే మాత్రం హైదరాబాద్ వాసులకు త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…