Acteess Sri vidhya: సినిమా ఇండస్ట్రీలో అవకాశం దొరికితే చాలు హీరోయిన్లను వాడుకొని వదిలేయడానికి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు.ఇలా ఎంతోమంది నటీమణులు చాలా తొందరగా మరొకరి చేతిలో మోసపోయి జీవితాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. అదేవిధంగా సినిమాలలో సంపాదించినది మొత్తం నమ్మకంతో ఇతరుల చేతులలో పెట్టి చివరికి అనాధలుగా మిగిలిపోయిన వారు ఉన్నారు.
ఇలా జీవితంలో తన జీవితాన్ని కోల్పోవడం కాకుండా దారుణంగా మోసపోయిన వారిలో నటి శ్రీ విద్యా ఒకరు. దివంగత నటి శ్రీవిద్య సైతం ఇలాంటి కోవకు చెందుతారు. శ్రీవిద్య తెలుగు తమిళ కన్నడ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.శ్రీవిద్య జన్మించిన ఏడాదికి తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ఈమె తల్లి దీంతో కష్టపడుతూ పెంచారు అయితే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో బాలునట్టుగా ఇండస్ట్రీలోకి వచ్చి అనంతరం హీరోయిన్ గా వెలుగు వెలిగారు.
తాత మనవడు సినిమాలు బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె అనంతరం ఢిల్లీ టు మద్రాస్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.ఇక అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమేకు కమల్ హాసన్ తో ప్రేమ ప్రయాణం కొనసాగుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే కమల్ హాసన్ వాణి గణపతితో ప్రేమలో ఉన్నారని తెలియగానే ఈమె అతనికి దూరంగా ఉన్నారు. ఇలా కమలహాసన్ కు దూరమైన ఈమె డైరెక్టర్ జార్జిథామస్ ప్రేమలో పడ్డారు.
ఇంట్లో వాళ్ళు వద్దన్నా వినకుండా ఈమె తనని పెళ్లి చేసుకుంది అయితే అతను తాగుడుకు చెడు అలవాట్లకు బానిస కావటం వల్ల తన ఆస్తిని మొత్తం నీళ్లలా ఖర్చు చేశారు.ఇలా తనకు విడాకులు ఇచ్చిన ఈమె భరత్ అనే మరో డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్నారు ఆయన కూడా ఈమెను మోసం చేసి మరొక పెళ్లి చేసుకున్నారు .ఇలా శ్రీవిద్య ఇండస్ట్రీలో మంచి నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఈమె సంతోషంగా గడిపిన క్షణాలు కన్నా తన జీవితంలో ఎక్కువగా కన్నీటి కష్టాలు ఉన్నాయని చెప్పాలి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…