Anupama Parameswaran: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయం అవసరం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని తాజాగా నిఖిల్ సరసన ఈమె కార్తికేయ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సాధారణంగా ప్రతి ఒక్క నటి నటులు వారి సినిమా విడుదలైతే తప్పనిసరిగా విడుదలైన రోజు చూస్తారు. మరికొందరైతే వారి నటించిన సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎలా వస్తుందోనని దొంగ చాటుగా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి రావడం చేస్తుంటారు.
ఈ విధంగానే అనుపమ పరమేశ్వరన్ శర్వానంద్ ఇద్దరు కలిసి నటించిన శతమానం భవతి సినిమా విడుదలైన రోజు వీరిద్దరూ కలిసి ఆ రోజు రాత్రి సినిమాకు వెళ్లారని,అయితే వీరిద్దరూ కలిసి నటించిన శతమానం భవతి సినిమాకు మాత్రం కాదంటూ ఈమె షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. మరి వీరిద్దరూ వీరి నటించిన సినిమా కాకుండా మరో ఏ సినిమాకు వెళ్లారని విషయానికి వస్తే…
శతమానం భవతి సినిమా విడుదలైన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా విడుదలైంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా చూడటానికి వెళ్లారని ఈమె వెల్లడించారు.ఇక తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టమని తాను థియేటర్లో చూసిన మొదటి సినిమా కూడా అదేనని ఈ సందర్భంగా అనుపమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…