Anupama Parameswaran: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయం అవసరం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోని తాజాగా నిఖిల్ సరసన ఈమె కార్తికేయ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సాధారణంగా ప్రతి ఒక్క నటి నటులు వారి సినిమా విడుదలైతే తప్పనిసరిగా విడుదలైన రోజు చూస్తారు. మరికొందరైతే వారి నటించిన సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎలా వస్తుందోనని దొంగ చాటుగా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి రావడం చేస్తుంటారు.
ఈ విధంగానే అనుపమ పరమేశ్వరన్ శర్వానంద్ ఇద్దరు కలిసి నటించిన శతమానం భవతి సినిమా విడుదలైన రోజు వీరిద్దరూ కలిసి ఆ రోజు రాత్రి సినిమాకు వెళ్లారని,అయితే వీరిద్దరూ కలిసి నటించిన శతమానం భవతి సినిమాకు మాత్రం కాదంటూ ఈమె షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. మరి వీరిద్దరూ వీరి నటించిన సినిమా కాకుండా మరో ఏ సినిమాకు వెళ్లారని విషయానికి వస్తే…

Anupama Parameswaran: మెగాస్టార్ కి పెద్ద అభిమానిని…
శతమానం భవతి సినిమా విడుదలైన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా కూడా విడుదలైంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా చూడటానికి వెళ్లారని ఈమె వెల్లడించారు.ఇక తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టమని తాను థియేటర్లో చూసిన మొదటి సినిమా కూడా అదేనని ఈ సందర్భంగా అనుపమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






























