Actor Charan Raj : ‘ప్రతిఘటన’ సినిమాలో విలన్ కాళీగా నటించిన చరణ్ రాజ్ అప్పటి నుండి తెలుగు ప్రేక్షకులకు తెలుసు. కర్ణాటకకు చెందిన చరణ్ రాజ్ అసలు పేరు బ్రహ్మానంద్, ఆయన స్వస్థలం బెల్గాం. అయితే నటన మీద చిన్నప్పటి నుండి బాగా ఇంట్రస్ట్ ఉండటంతో ఇంట్లో చెప్పకుండా డబ్బు తీసుకుని బెంగళూరు వెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అలా ‘పరజిత’ అనే సినిమాలో మొదటగా హీరోగా చేసిన ఆయన ఆ సినిమా 100 రోజులు ఆడటంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ప్రతిఘటన సినిమా ద్వారా విలన్ గా పేరు తెచ్చుకోవడంతో చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన చరణ్ ఒకసారి మాత్రం గుడిలోకి గన్ తో వెళ్లి బాగా వైరల్ అయ్యారు. ఆ ఇష్యూ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
గన్ తో గుడికి వెళ్లడంతో ప్రపంచం మొత్తం తెలిసిపోయాను…
చరణ్ రాజ్ గారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో దీక్ష తీసుకుని కాణిపాకం వెళ్లడం అనవయితీగా పెట్టుకున్నారట. అలానే ఒకసారి వెళ్లగా అక్కడికి వెళ్ళాక బెల్ట్ కి ఉన్న రివాల్వర్ తీసేయడం మర్చిపోయి అలానే గుడిలోకి వెళ్లి పూజ చేయించి దీక్ష విరమించుకున్నాక అక్కడ కూర్చునే సమయంలో గన్ కనిపించడంతో మీడియా మొత్తం ఫోకస్ చేశారట. బయటికి వచ్చాక రూమ్ కి వెళ్ళాక స్నేహితులు ఫోన్ చేసి టీవీ 9 చూడమని చెప్పగా టీవీ చూడగానే గన్ తో చరణ్ రాజ్ గుడిలో అంటూ బ్రేకింగ్ వస్తోంది.
వినాయకునికి పూజ చేసానో లేదో ఒక్కసారిగా ఇండియా మొత్తం వైరల్ అయ్యాను. టీవీ 9 పుణ్యమా అని అంతవరకు తెలియని వాళ్లకు కూడా నేను తెలుసాను అంటూ చెప్పారు. నిజానికి నాతో లైసెన్స్డ్ రివాల్వర్ ఉంటుంది. ఇంతవరకు ఏ సినిమా ఆర్టిస్ట్ కి లేనట్టుగా నాకు ఐదు రాష్ట్రాలకు లైసెన్స్డ్ గన్ ఉంది. ప్రతిఘటన సినిమా తరువాత నాకు ఇచ్చారు. తమిళనాడు, కేరళ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఐదు రాష్ట్రాలకు కలిపి ఉంది అంటూ చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…