Producer Avula Giri : డిస్ట్రిబ్యూటర్ గా ఖుషి, నరసింహనాయుడు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవుల గిరి ఆపైన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. శ్రీఆంజనేయం, కలుసుకోవాలని, నా అల్లుడు, ఆంధ్రవాలా, సై వంటి సినిమాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం సినిమా నిర్మాణంకి, సినిమాలకు దూరంగా ఉన్నారు. వివాదాలకు దూరంగా సినిమాలను నిర్మిస్తు డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా ఏదిగిన ఆవుల గిరి కొన్ని కాంబినేషన్స్ ఎలా ఆగిపోయాయో ఇండస్ట్రీలో ఎలాంటి పాలిటిక్స్ జరుగుతాయో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
సురేష్ బాబు వార్నింగ్ ఇచ్చాడు…
ఆవుల గిరి సినిమాలను తీయకపోడాన్ని ఇండస్ట్రీకి దూరంగా జరగడానికి గల కారణాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబుతో మంచి సంబంధందాలు ఉండేవని తెలిపిన ఆయన వెంకటేష్ తో ఒక సినిమా చేయాలనే ఆలోచనతో శీను వైట్ల వెంకీ కాంబినేషన్ కోసం ట్రై చేసి, కథ రెడీ చేయడానికి స్క్రిప్ట్ కోసం డబ్బు ఖర్చు చేసి, కథ వెంకటేష్ కు వినిపించి అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటే ఆయన ఇంకొన్ని మార్పులు చెప్పి అంతా ఒకే అయ్యాక తీసుకుంటా అని చెప్పడం తో సురేష్ బాబు తోనూ మాట్లాడి కథ పనుల్లో ఉండగా ఒక పది రోజులు హాలిడేస్ కోసం పిల్లలతో బయటకి వెళ్ళి వచ్చేసరికి నిర్మాతగా ఇంకొకరి పేరు వినిపించింది. ఇద్దరు నిర్మాతలతో సినిమా అనగానే నేను వెళ్లి సురేష్ బాబు గారిని అడిగాను, సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యం అయినా ఒకే కానీ వేరే వాళ్లతో ఎందుకు, నేను ముందే చెప్పాను కదా నేనే చూసుకుంటా అని అడిగితే మాటా మాటా పెరిగి గొడవయింది.
అపుడే నువ్వు ఇండస్ట్రీలో మళ్ళీ సినిమా ఎలా తీస్తావో చూస్తా అంటూ ఛాలెంజ్ చేసారు. ఇక ఆ తరువాత నేను రామానాయుడు గారి వద్దకు వెళ్లి జరిగినది చెప్తే ఆయన నా చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదు అని చెప్పేసారు. నాకు ఇక ఇండస్ట్రీ మీద అప్పటికే విరక్తితో ఉన్నాను, ఇచ్చిన మాటకు విలువ లేదని అర్థమై దూరం అయ్యాను. ఇక అప్పటికి పిల్లల చదువుల మీద దృష్టి పెట్టాలని అలోచించి ఇక సినిమాల వైపు రాలేదు. అయితే సురేష్ బాబు గారు కూడా సొంతంగా నిర్మించి సినిమాలను తీయలేదు. వేరేవాళ్లు తీసిన సినిమాలను కొనుక్కుని వాళ్ల పేరు వేసుకున్నారు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…