Producer Avula Giri : డిస్ట్రిబ్యూటర్ గా ఖుషి, నరసింహనాయుడు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవుల గిరి ఆపైన నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. శ్రీఆంజనేయం, కలుసుకోవాలని, నా అల్లుడు, ఆంధ్రవాలా, సై వంటి సినిమాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం సినిమా నిర్మాణంకి, సినిమాలకు దూరంగా ఉన్నారు. వివాదాలకు దూరంగా సినిమాలను నిర్మిస్తు డిస్ట్రిబ్యూటర్ నుండి నిర్మాతగా ఏదిగిన ఆవుల గిరి కొన్ని కాంబినేషన్స్ ఎలా ఆగిపోయాయో ఇండస్ట్రీలో ఎలాంటి పాలిటిక్స్ జరుగుతాయో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
సురేష్ బాబు వార్నింగ్ ఇచ్చాడు…
ఆవుల గిరి సినిమాలను తీయకపోడాన్ని ఇండస్ట్రీకి దూరంగా జరగడానికి గల కారణాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబుతో మంచి సంబంధందాలు ఉండేవని తెలిపిన ఆయన వెంకటేష్ తో ఒక సినిమా చేయాలనే ఆలోచనతో శీను వైట్ల వెంకీ కాంబినేషన్ కోసం ట్రై చేసి, కథ రెడీ చేయడానికి స్క్రిప్ట్ కోసం డబ్బు ఖర్చు చేసి, కథ వెంకటేష్ కు వినిపించి అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటే ఆయన ఇంకొన్ని మార్పులు చెప్పి అంతా ఒకే అయ్యాక తీసుకుంటా అని చెప్పడం తో సురేష్ బాబు తోనూ మాట్లాడి కథ పనుల్లో ఉండగా ఒక పది రోజులు హాలిడేస్ కోసం పిల్లలతో బయటకి వెళ్ళి వచ్చేసరికి నిర్మాతగా ఇంకొకరి పేరు వినిపించింది. ఇద్దరు నిర్మాతలతో సినిమా అనగానే నేను వెళ్లి సురేష్ బాబు గారిని అడిగాను, సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యం అయినా ఒకే కానీ వేరే వాళ్లతో ఎందుకు, నేను ముందే చెప్పాను కదా నేనే చూసుకుంటా అని అడిగితే మాటా మాటా పెరిగి గొడవయింది.
అపుడే నువ్వు ఇండస్ట్రీలో మళ్ళీ సినిమా ఎలా తీస్తావో చూస్తా అంటూ ఛాలెంజ్ చేసారు. ఇక ఆ తరువాత నేను రామానాయుడు గారి వద్దకు వెళ్లి జరిగినది చెప్తే ఆయన నా చేతుల్లో ఇప్పుడు ఏమీ లేదు అని చెప్పేసారు. నాకు ఇక ఇండస్ట్రీ మీద అప్పటికే విరక్తితో ఉన్నాను, ఇచ్చిన మాటకు విలువ లేదని అర్థమై దూరం అయ్యాను. ఇక అప్పటికి పిల్లల చదువుల మీద దృష్టి పెట్టాలని అలోచించి ఇక సినిమాల వైపు రాలేదు. అయితే సురేష్ బాబు గారు కూడా సొంతంగా నిర్మించి సినిమాలను తీయలేదు. వేరేవాళ్లు తీసిన సినిమాలను కొనుక్కుని వాళ్ల పేరు వేసుకున్నారు అంటూ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…