Movie News

చద్దన్నం ఓ సంజీవిని అంటున్న జగపతి బాబు!

సినిమా జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో జగపతి బాబుకి తన నిజజీవితంలో కూడా తన జీవన విధానం ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది. కానీ జగపతి బాబు మాత్రం ప్రకృతి ఒడిలోనే సేద తీరాలి అని చెబుతారు.వెండితెరపై హీరోగా, విలన్ గా, సైడ్ ఆర్టిస్ట్ గా ఎన్నో విభిన్న పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు పలు ఆసక్తికరమైన విషయాలను ముచ్చటించారు.

సాధారణంగా ఒక సెలబ్రిటీ అంటే ఫైవ్ స్టార్ హోటల్, లగ్జరీ కార్లు, వివిధ రకాల ఆహార పదార్థాలు, వారిపై ఈగ కూడా వాలకుండా చుట్టూ బౌన్సర్లు ఇలా వారి జీవన విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. కానీ హీరో జగపతి బాబు మాత్రం ప్రకృతి ఒడిలో పెరిగే ముద్దుబిడ్డ అని చెప్పవచ్చు.ప్రకృతి అమ్మలాంటిది అని ఆ అమ్మ తోనే మన జీవితం ముడిపడి ఉందని ఈ సందర్భంగా జగపతిబాబు తెలియజేశారు.

ప్రస్తుతం చాలామంది డబ్బు సంపాదించాలి, మన వెల్త్ బ్యాంకును క్రెడిట్ చేసుకోవాలని ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వారి హెల్త్ బ్యాంక్ పూర్తిగా నాశనం అవుతుందని తెలిపారు. కేవలం డబ్బు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటుంది అనడం ఏమాత్రం సరికాదని,అదే నిజమైతే డబ్బున్న వారు ఎవరు కరోనాతో చనిపోరని జగపతిబాబు తెలియజేశారు. డబ్బు, సంపాదన కంటే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు.

పచ్చటి మొక్కల మధ్య, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరడం తనకెంతో ఇష్టమని,అదే విధంగా ప్రతి రోజు ఉదయం లేవగానే తను కేవలం చద్దన్నం మాత్రమే తీసుకుంటానని ఈ సందర్భంగా జగపతి బాబు తెలిపారు. చాలామంది చద్దన్నం తినడానికి ఎంతో నామోషీగా ఫీల్ అవుతారు. కానీ చద్దన్నం మన పాలిట మన ఆరోగ్యం పాలిట ఓ సంజీవని అని,రుచితోపాటు పోషకాలు అధికంగా ఉండే చద్దన్నం తినడం తనకెంతో ఇష్టమని ఈ సందర్భంగా ఈ ఫ్యామిలీ హీరో తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

8 hours ago

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…

8 hours ago

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…

8 hours ago

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…

8 hours ago

వాష్‌రూమ్‌కు వెళ్లి మాయమైన ఖైదీ.. పోలీసులకు షాక్!

హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…

9 hours ago

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…

10 hours ago