సాధారణంగా అంతరిక్షంలోకి వెళ్ళేది కేవలం వ్యోమగాములనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే అలాంటి వారిని చూడాలన్నా సాధారణ ప్రజలకు సాధ్యం కాదు. అలాంటిది ఒక సామాన్యురాలు అంతరిక్షంలోకి వెళ్లి అవకాశాన్ని దక్కించుకుంది. అది ఒక సామాన్యురాలికి ఎలా సాధ్యం అయ్యింది అనే విషయాలను తెలుసుకుందాం.
వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూరిజం సంస్థ వచ్చే సంవత్సరం నుంచి మనుషులను అంతరిక్ష పర్యాటకానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే అంతరిక్షంలోకి వెళ్లిన పర్యాటకులకు అనుగుణంగా వారిపై పరిశోధనలను ప్రారంభించింది.ఈ క్రమంలోనే టిక్ టాకర్ గా స్టెమ్ అంశాలతోపాటు తల్లిగా తన అనుభవాలను టిక్టాక్, ఇన్స్టా ద్వారా షేర్ చేస్తూ ఎంతో మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న కెల్లీ గెరార్డిని ఎంపిక చేశారు.
కెల్లీ కేవలం టిక్ టాకర్ గా మాత్రమే కాకుండా ఆమె ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్సెస్ (ఐఐఏఎస్)లో పరిశోధకురాలు. స్పేస్ టూరిజం పై కొంత ఆసక్తి, కొంత ఫాలోయింగ్ ఉండటంతో ఈ విధమైన ప్రయోగాలకు ఈమెను ఎంపిక చేసుకున్నారు. అయితే ఈమె కేవలం అంతరిక్షంలో వెళ్లి రావడానికి మాత్రమే కాకుండా అంతరిక్షంలో ఈమె పై ప్రయోగాలను నిర్వహించనున్నారు. జీరో గ్రావిటీ ఉన్న సమయంలో అంతరిక్షంలో మనిషి శరీరంలో జరిగే మార్పులు, శరీర బరువు పై సుమారు 60 నిమిషాల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగా స్పేస్ ఫ్లైట్ లను మరింత సమర్థవంతంగా పునరుద్ధరించాలని ఆలోచన చేస్తోంది.
ఈ సందర్భంగా కెల్లీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు అంతరిక్షంలో ప్రయాణించినది కేవలం కొంత మంది మాత్రమే. వారిలో మహిళలు అది అమ్మలు వెళ్లడం చాలా అరుదు. అలాంటి వారిలో నేను భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని,తను ఈ పరిశోధనకు ఒప్పు కోవడం ద్వారా మరెంతోమంది పరిశోధకులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా కెల్లీ గెరార్డి తెలియజేశారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…