ప్రస్తుత కాలంలో ఒక అపార్ట్ మెంట్ కట్టాలంటే ఎక్కువ సంఖ్యలో సిమెంటు, కంకర, ఇసుక, ఇనుము మనకు అవసరం అవుతుంది. ఇన్ని కలిస్తేనే మనకు ఎంతో దృఢమైన అపార్ట్మెంట్ తయారవుతుంది. ప్రస్తుత కాలంలో రోజురోజుకూ జనాభా పెరగడం వల్ల జనాలు నివసించడానికి స్థలం లేకపోవడంతోనే ఈ విధంగా అపార్ట్మెంట్లు మనకు దర్శనమిస్తున్నాయి. కానీ చైనాలో మాత్రం ప్రాచీన కాలంలోనే అపార్ట్మెంట్ లు ఉండేవి. అయితే ఆ అపార్ట్మెంట్ అన్ని ఇనుము, సిమెంట్ కాకుండా కేవలం మట్టితో నిర్మించినవి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
చైనాలో దాదాపు 12 వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ ఏమాత్రం చెక్కుచెదరకుండా ఎంతో భద్రంగా ఉన్నాయి. అందుకే వీటిని UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు ఇచ్చింది.ఎంతో అద్భుతమైన ఈ కట్టడాలు మట్టితో నిర్మించడం ఎంతో ఆశ్చర్యం. సాధారణంగా భవనాలు చతురస్రాకారంలో ఉండటం మనం చూస్తూ ఉంటాము కానీ ఇక్కడ మాత్రం గుండ్రని మట్టి భవనాలు మనకు దర్శనమిస్తాయి. ఈ భవనాలను చూడటానికి రోజురోజుకు పర్యాటకుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ అద్భుతమైన కట్టడాలు చైనాలోని ఫ్యుజియన్లో ఉన్నాయి. అందుకే ఈ కట్టడాలను వీటిని ‘ఫ్యుజియన్ టులువ్’ అని పిలుస్తారు.
ఒక్కో భవనంలో సుమారు మూడు నుంచి ఐదు అంతస్తులు. వీటిలో సుమారు 50 కుటుంబాల వరకు జీవనం కొనసాగించే వారు. ఈ భవనాలు నిర్మించడానికి ఎక్కడా కూడా సిమెంటు, ఇనుము వాడకపోవడం విశేషం.అయితే అప్పట్లో బందిపోటు అధికంగా ఉండటం వల్ల గ్రామస్తులు అందరూ కలిసి ఈ విధమైనటువంటి కట్టడాలను నిర్మించుకొని అందరూ ఒకే చోట నివసించే వారు.వీరు బయటకు వెళ్ళడానికి వీలులేకుండా అన్ని ఆ భవనంలోనే సమకూర్చుకునే వారు. కాలక్రమేణా ఈ భవనాలలో నివసించే వారి సంఖ్య తక్కువగా అయినప్పటికీ ఈ భవనాలను వీక్షించే వారి సంఖ్య అధికమవుతోంది.
ఈ మట్టి భవనాలను నిర్మించడానికి కేవలం మట్టి కంకర ను మాత్రమే ఉపయోగించారు. ఇనుప కడ్డీలకు బదులుగా వెదురు బొంగులను వాడారు కేవలం భవనాల రక్షణ కోసం నిర్మించిన తలుపులకు మాత్రమే బయటవైపు ఇనుప కడ్డీలు ఉపయోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఫ్యుజిన్ వ్యాప్తంగా 20,000 టులులు ఉన్నాయి. వీటి మోడల్స్ నచ్చి చైనాలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఇలాంటి మట్టి కట్టడాలు వెలిశాయి. అయితే ఈ కట్టడాలు అన్ని కాలాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విధమైనటువంటి కట్టడాలు పెద్ద ఎత్తున పర్యటకులను ఆకర్షించు కుంటున్నాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎంతో అద్భుతమైన ఈ భవనాలను పర్వత ప్రాంతాలలో నిర్మించడం మరొక విశేషం అని చెప్పవచ్చు. పర్వత ప్రాంతంలో నిర్మించిన ఈ కట్టడాలకు సంబంధించిన భవనాలను ఈ వీడియోలో చూడవచ్చు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…