Actor Jogi Naidu : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన జోగి నాయుడు గారు జెమినీ టీవీలో వస్తున్న జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు డైరెక్టర్స్ తో పనిచేstuనే మరోవైపు సినిమాల్లో కమెడియన్ గా కూడా చేసారు. ఇక జెమినీ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే యాంకర్ ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఇక జోగి నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. పెళ్లి, విడాకుల వల్ల పిల్లలు ఇబ్బందుల్లో పడుతారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
నా కూతురితో ఏం మాట్లాడాలో తెలియలేదు…
జోగి నాయుడు, యాంకర్ ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆ తరువాత మనస్పర్తల కారణంగా విడిపోయారు. అయితే ఎనిమీదేళ్లకు వారికి విడాకులు రాగా విడిపోవడం నాకు ఇష్టం లేదంటూ జోగి నాయుడు ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే భార్య భర్తలు డివోర్స్ తీసుకోవడం వల్ల పిల్లలు ఇబ్బందులు పడతారని మేము విడాకులు తీసుకున్న సమయంలో పాప తన వద్దే ఉండగా కోర్ట్ వారంలో ఒక గంట పాప నా వద్ద ఉండొచ్చు అనే అనుమతి ఇచ్చింది. ఆ గంట ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అని నరకం చూసాను.
నా కూతురికి ఎన్నో నేర్పించాలి అనికునేవాడిని. పిల్లలు ఆ ఏజ్ లో నేర్చుకున్నవి లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు. కానీ ఆ గంట సమయంలో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. పాప కూడా వెళ్ళేటపుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేది ఆ వయసులో తాను చూడాల్సిన పరిస్థితులు కావు అంటూ తెలిపారు. ఇక తనని చూడటం కోసమని ఝాన్సీ ఇంటికి దగ్గర్లోనే ఒక ఇల్లు తీసుకుని అక్కడే కొన్నేళ్లు ఉండి పాపను చూసేవాడిని కానీ కొన్నేళ్లకు అలా ఉండటం నరకంలాగా అనిపించింది. బయటపడాలని అనుకున్నాను అంటూ చెప్పారు. ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకున్న ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…