Actor Madhvan: తెలుగు తమిళ భాషలలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మాధవన్ గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలో ది రాకెట్రి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రముఖ భారతీయ ఇస్రోశాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం.
ఇకపోతే ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఇక ఇప్పటికీ ఈ సినిమా పలుచోట్ల థియేటర్లలో రన్ అవుతుందని చెప్పాలి. ఇక ఈ సినిమా ద్వారా మాధవన్ దర్శకుడిగా మారడమే కాకుండా ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇకపోతే ఈ సినిమా ద్వారా మాధవన్ భారీ నష్టాలను ఎదుర్కొన్నారని ఈ సినిమా వల్ల వచ్చిన నష్టాలను తీర్చడం కోసం ఏకంగా ఆయన ఆస్తులను కూడా అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి.
ఇలా ఈ సినిమా నష్టాల నుంచి బయటపడటానికి మాధవన్ తాను నివస్తున్న ఇంటిని కూడా అమ్మకున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై ఈయన స్పందించారు. ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ ఆ భగవంతుడి దయవల్ల తాను ఒక మంచి సినిమా చేశానని ఈ సినిమా వల్ల తాను ఎలాంటి నష్టాలను ఎదుర్కోలేదని ఈయన వెల్లడించారు.ఇకపోతే ఈ ఏడాది ది రాకెట్రీ సినిమా కోసం పనిచేసిన వారందరూ కూడా ప్రభుత్వానికి ఎక్కువగానే టాక్స్ చెల్లించి ఉంటారని ఈయన పేర్కొన్నారు.
ఇకపోతే తనకు ఇల్లు అంటే ఎంతో ఇష్టం అలాంటిది తాను నివసిస్తున్న ఇల్లును కూడా అమ్మారని వస్తున్నటువంటి వార్తలలో ఏ విధమైనటువంటి వాస్తవం లేదని ఇప్పటికి తాను ఆ ఇంట్లోనే నివసిస్తున్నానని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగా నేను ఆస్తులు అమ్ముకున్నాను అని వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని అవన్నీ ఆ వాస్తవాలేనని ఈయన కొట్టిపారేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…