Actor Ponnambalam: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా అంతే చురుగ్గా పాల్గొంటూ ఉంటారు.ఈయన ఇప్పటికే ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో సహాయం చేశారు. అలాగే ఆపదలో ఉన్నటువంటి సినీ కార్మికులకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు..
ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి అందరితో సహాయం చేసినప్పటికీ ఆయన చేసిన సహాయాన్ని ఎప్పుడు బయట పెట్టుకోలేదు. అయితే ఈయన నుంచి సహాయం పొందిన వారు మాత్రం మెగాస్టార్ మంచి మనసు పై ప్రశంసలకు కురిపిస్తూ ఉన్నారు. తాజాగా తమిళ సినిమా ఇండస్ట్రీలో విలన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పొన్నం బలం తీవ్రమైన అనారోగ్యానికి గురై కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈయన కిడ్నీ ఆపరేషన్ కి సంబంధించిన ఖర్చులు మొత్తం మెగాస్టార్ చిరంజీవి భరించారని అందుకు సుమారు 40 లక్షల వరకు ఖర్చయిందంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ తన కిడ్నీ సమస్యతో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యాను అయితే ఎవరిని సహాయం అడగాలో తెలియక తన స్నేహితులతో చిరంజీవి గారి నంబర్ తీసుకొని తన పరిస్థితిని తెలియజేస్తూ మెసేజ్ చేశానని తెలిపారు.
ఇలా నేను మెసేజ్ చేసిన 20 నిమిషాలకే చిరంజీవి గారి నుంచి రిప్లై వచ్చింది తనని వెంటనే హైదరాబాద్ రమ్మని చిరంజీవి గారు చెప్పారు. నేను రాలేనని చెప్పడంతో పది నిమిషాలలో నీకు అపోలో హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది వెళ్లి అక్కడ అడ్మిట్ అవ్వు అని చెప్పారు. అన్నయ్య చెప్పిన విధంగానే నాకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందని అక్కడ తనకు రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ మొత్తం జరిగిందని అందుకు సంబంధించిన ఖర్చు మొత్తం చిరంజీవి అన్నయ్య భరించారంటూ ఈ సందర్భంగా ఈయన చిరంజీవి చేసిన సహాయం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…