Actor Ponnambalam: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా అంతే చురుగ్గా పాల్గొంటూ ఉంటారు.ఈయన ఇప్పటికే ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరికో సహాయం చేశారు. అలాగే ఆపదలో ఉన్నటువంటి సినీ కార్మికులకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు..
ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి అందరితో సహాయం చేసినప్పటికీ ఆయన చేసిన సహాయాన్ని ఎప్పుడు బయట పెట్టుకోలేదు. అయితే ఈయన నుంచి సహాయం పొందిన వారు మాత్రం మెగాస్టార్ మంచి మనసు పై ప్రశంసలకు కురిపిస్తూ ఉన్నారు. తాజాగా తమిళ సినిమా ఇండస్ట్రీలో విలన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పొన్నం బలం తీవ్రమైన అనారోగ్యానికి గురై కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈయన కిడ్నీ ఆపరేషన్ కి సంబంధించిన ఖర్చులు మొత్తం మెగాస్టార్ చిరంజీవి భరించారని అందుకు సుమారు 40 లక్షల వరకు ఖర్చయిందంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ తన కిడ్నీ సమస్యతో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యాను అయితే ఎవరిని సహాయం అడగాలో తెలియక తన స్నేహితులతో చిరంజీవి గారి నంబర్ తీసుకొని తన పరిస్థితిని తెలియజేస్తూ మెసేజ్ చేశానని తెలిపారు.
ఇలా నేను మెసేజ్ చేసిన 20 నిమిషాలకే చిరంజీవి గారి నుంచి రిప్లై వచ్చింది తనని వెంటనే హైదరాబాద్ రమ్మని చిరంజీవి గారు చెప్పారు. నేను రాలేనని చెప్పడంతో పది నిమిషాలలో నీకు అపోలో హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది వెళ్లి అక్కడ అడ్మిట్ అవ్వు అని చెప్పారు. అన్నయ్య చెప్పిన విధంగానే నాకు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందని అక్కడ తనకు రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ మొత్తం జరిగిందని అందుకు సంబంధించిన ఖర్చు మొత్తం చిరంజీవి అన్నయ్య భరించారంటూ ఈ సందర్భంగా ఈయన చిరంజీవి చేసిన సహాయం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…