Analyst Shravan Kumar : సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరిగితే అది వెంటనే వైరల్ అవుతుంది. అందుకే సెలెబ్రిటీల మీద ఏదో ఒక గాసిప్ పుట్టించి సోషల్ మీడియాలో మంచి వ్వ్యూస్ లైక్స్ వస్తాయని చాలమంది నేడు అసత్యాలను ప్రచారం చేస్తూ సోషల్ మీడియా ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు బయట కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ సినిమా కత నాదే వాళ్ళు కాపీ కొట్టారంటూ కొంతమంది కోర్టును ఆశ్రయిస్తుంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మీద కూడా ఒక భూమి విషయంలో శ్రీకాంత్ అనే వ్యక్తి హై కోర్ట్ ను ఆశ్రయించాడు. దేంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిరంజీవి మోసపోయాడా…
ఈ ఇష్యూ గురించి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ కొంత మంది మీడియా హైప్ కోసం కూడా ఇలాంటివి చేస్తుంటారు. అయితే న్యాయ స్థానం నిజానిజాలను తేలుస్తుంది అంటూ అభిప్రాయపడ్డారు. చిరంజీవి గారికి జూబ్లీహిల్స్ లోని సొసైటీ లో 600 గజాల భూమి ఉంది. అయితే అది చిరంజీవిది కాదు అంటూ నేడు శ్రీకాంత్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడం జరిగింది. జూబ్లీహిల్స్ సొసైటీ ఒక జటిల పదార్థం అక్కడ సవ్యంగా భూముల వివరాలు లేవు అందుకే తరచూ సమస్యలు వస్తున్నాయి అంటూ శ్రవణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
చిరంజీవి గారు స్వయంగా ల్యాండ్ విషయం పట్టించుకుని ఉండకపోవచ్చు, ఆయన సిబ్బంది మేనేజర్లు ఎవరైనా సరైన అవగాహన లేకుండానే ల్యాండ్ కొనుగోలు చిరంజీవి గారితో చేయించి ఉండవచ్చు అంటూ కేసుకు మరో కోణం తెలిపారు. కోర్ట్ వద్దకు వివాదం వెళ్ళింది కాబట్టి ఇరు పక్షాల వద్ద ఉన్న డాక్యూమెంట్స్ బట్టి అసలు ఎవరి ల్యాండ్ అన్నది నిర్ణయిస్తారు అంటూ తెలిపారు. ఇక రాజకీయ కుట్రలో భాగంగా కూడా ఇలాంటి కేసులు చిరంజీవి గారి మీద వేసి ఉండవుచ్చు. ఏ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువవుతున్నాయి అంటూ చెప్పారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…