Nilesh parents : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయి. కమిషన్ ఆఫీస్ నుండే పరీక్ష పేపర్ లీక్ అవ్వడం కలకలం రేపింది. దీని వెనుక కమిషనర్ పిఏ ప్రవీణ్, అతనితో పాటు మరో మహిళ రేణుక ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వారిని రిమాండ్ కు తరలించగా ప్రవీణ్ ఫోన్ లో దాదాపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళా అభ్యర్థుల న్యూడ్ ఫోటోలు వీడియో కాల్స్ రికార్డింగ్ అన్నీ ఉన్నాయి. దాదాపు 46 మంది మహిళల న్యూడ్ వీడియోలు ఫొటోలు ప్రవీణ్ ఫోన్ లో దొరకగా పేపర్ లీక్ చేయించుకున్న అభ్యర్థులలో మమహబూబ్ నగర్ జిల్లా మన్సుర్ తండాకు చెందిన నీలేష్, రాజేందర్ అనే అభ్యర్థుల తల్లి దండ్రులు మీడియాతో మాట్లాడుతూ అసలు ఈ విషయాలేవి తెలియదని చెబుతున్నారు.
పది లక్షలు ఇచ్చేంత స్థోమత లేదు…
నీలేష్ పూణేలోనే జాబ్ చేస్తూ ఉండేవాడని ఊరి లో తమకు కొంత భూమి ఉండగా ఇతర వ్యవసాయ పనులకు కూలి వెళ్తున్నట్లు నీలేష్, రాజేందర్ ల తల్లి చెబుతున్నారు. ఇక కేసులో కీలకంగా ఉన్న రేణుక పక్కన ఉన్న తండాకు చెందిన మహిళ అయినా తమకు తెలియదని వివరిస్తున్నారు. ఎవరో ఇరికించారని తమ పిల్లలకు ఇలాంటి బుద్ధి లేదని పది లక్షలు రేణుకకి ఇచ్చేంత స్థోమత లేదంటూ వివరించారు. అసలు ఎవరు మోసం చేసారో తెలియదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.
ప్రభుత్వం టీచర్ అయిన రేణుక ప్రవీణ్ ద్వారా టిఎస్పిఎస్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ కమిషనర్ తో పరిచయం పెంచుకుని లాగిన్ ఐడి పాస్ వర్డ్ సంపాదించి ప్రవీణ్ ద్వారా పేపర్ లీకేజీ చేయించుకుంది. తన కమ్యూనిటీ వాళ్ళైన నీలేష్, రాజేందర్ లకు పేపర్ తనకు తెలుసనీ సమాచారం అందించి మరికొంత మంది వద్ద పది నుండి ఇరవై లక్షల దాకా వసూలు చేసి పేపర్ లీక్ చేసింది. నీలేష్, రాజేంధర్ లను తన ఇంట్లోనే పెట్టుకుని ఎక్సామ్ కి ముందు ప్రిపేర్ చేయించి తానే స్వయంగా పరీక్షా కేంద్రం వద్ద దిగబెట్టినట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…