Naatu Naatu Song:తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డివివి దానయ్య నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ విజయం పై స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలా ఈ సినిమా ఇప్పటికే ఎన్నో పురస్కారాలను అందుకుంది అయితే ఈ వేడుకలలో భాగంగా నిర్మాత దానయ్య ఇక్కడ కనిపించకపోవడంతో అసలు దానయ్య రాకపోవడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీశారు.ఇలా ఏ ఒక్క వేడుకలో కూడా దానయ్య కనిపించకపోవడంతో అసలు ఏం జరిగింది అని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.
ఇక ఆస్కార్ అవార్డు రావడంతో ఈ విషయంపై నిర్మాత దానయ్య స్పందించారు. ఇలా తను నిర్మించిన ఒక సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడం నిజంగా గర్వించదగ్గ విషయమని ఈయన తెలిపారు. RRR సినిమా రిలీజ్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి, RRR టీం ఎవ్వరితో నేను కాంటాక్ట్ లో లేననీ ఈ సందర్భంగా దానయ్య వెల్లడించారు.
తన నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈయన మాత్రం సినిమా విడుదల తర్వాత వీరితో కాంటాక్ట్ లేను అని చెప్పడంతో అసలు ఎందుకు లేరనే విషయం చర్చలకు దారితీస్తుంది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్లకు దానయ్య అడిగిన మొత్తంలో డబ్బు ఇవ్వకపోవడం వల్లే రాజమౌళి దానయ్య మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…