Movie News

Naatu Naatu Song: వారితో నాకు కాంటాక్ట్స్ లేవు…. ఆస్కార్ అవార్డుపై స్పందించిన దానయ్య!

Naatu Naatu Song:తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డివివి దానయ్య నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ విజయం పై స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా ఈ సినిమా ఇప్పటికే ఎన్నో పురస్కారాలను అందుకుంది అయితే ఈ వేడుకలలో భాగంగా నిర్మాత దానయ్య ఇక్కడ కనిపించకపోవడంతో అసలు దానయ్య రాకపోవడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీశారు.ఇలా ఏ ఒక్క వేడుకలో కూడా దానయ్య కనిపించకపోవడంతో అసలు ఏం జరిగింది అని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.

ఇక ఆస్కార్ అవార్డు రావడంతో ఈ విషయంపై నిర్మాత దానయ్య స్పందించారు. ఇలా తను నిర్మించిన ఒక సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడం నిజంగా గర్వించదగ్గ విషయమని ఈయన తెలిపారు. RRR సినిమా రిలీజ్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి, RRR టీం ఎవ్వరితో నేను కాంటాక్ట్ లో లేననీ ఈ సందర్భంగా దానయ్య వెల్లడించారు.

Naatu Naatu Song: సినిమా రిలీజ్ తర్వాత కాంటాక్ట్ లో లేను….

తన నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈయన మాత్రం సినిమా విడుదల తర్వాత వీరితో కాంటాక్ట్ లేను అని చెప్పడంతో అసలు ఎందుకు లేరనే విషయం చర్చలకు దారితీస్తుంది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్లకు దానయ్య అడిగిన మొత్తంలో డబ్బు ఇవ్వకపోవడం వల్లే రాజమౌళి దానయ్య మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago