Naatu Naatu Song:తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డివివి దానయ్య నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ విజయం పై స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలా ఈ సినిమా ఇప్పటికే ఎన్నో పురస్కారాలను అందుకుంది అయితే ఈ వేడుకలలో భాగంగా నిర్మాత దానయ్య ఇక్కడ కనిపించకపోవడంతో అసలు దానయ్య రాకపోవడానికి గల కారణం ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీశారు.ఇలా ఏ ఒక్క వేడుకలో కూడా దానయ్య కనిపించకపోవడంతో అసలు ఏం జరిగింది అని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు.
ఇక ఆస్కార్ అవార్డు రావడంతో ఈ విషయంపై నిర్మాత దానయ్య స్పందించారు. ఇలా తను నిర్మించిన ఒక సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు రావడం నిజంగా గర్వించదగ్గ విషయమని ఈయన తెలిపారు. RRR సినిమా రిలీజ్ తర్వాత చరణ్, తారక్, రాజమౌళి, RRR టీం ఎవ్వరితో నేను కాంటాక్ట్ లో లేననీ ఈ సందర్భంగా దానయ్య వెల్లడించారు.
తన నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఈయన మాత్రం సినిమా విడుదల తర్వాత వీరితో కాంటాక్ట్ లేను అని చెప్పడంతో అసలు ఎందుకు లేరనే విషయం చర్చలకు దారితీస్తుంది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్లకు దానయ్య అడిగిన మొత్తంలో డబ్బు ఇవ్వకపోవడం వల్లే రాజమౌళి దానయ్య మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…