Actor Prakash Raj : విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ సినిమాలే కాకుండా ప్రస్తుతం పాలిటిక్స్ లోనూ విలక్షణంగానే ఉన్నాడు. సొంత రాష్ట్రం కర్ణాటకలో చదువుకునే రోజుల్లో ఎన్నో డ్రామాలలో నటించిన ప్రకాష్ ఆ తరువాత తమిళ సినిమా ద్వారా సినిమాకు పరిచయమైయ్యడు. ఆ తరువాత తెలుగు మలయాళం అంటూ అన్ని భాషలలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా ఏదైనా పాత్ర ఏదైనా ప్రకాశ్ రాజ్ నటన సినిమాకు ప్లస్ అనేలా ఆయన నటిస్తారు. నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు అంటూ విలనిజం చూపించినా, అంతః పురంలో ఫ్యాక్షన్ నేతగా చేసినా, ఖడ్గంలో ఒక భారతీయ ముస్లిం గా నటించినా అన్నింటిలోనూ తన పాత్రకు న్యాయం చేసాడు ప్రకాష్ రాజ్. తాజాగా కృష్ణ వంశీ డైరెక్షన్ లో రంగమార్తాండ సినిమాలో నటించిన ఆయన ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.
విషాదాల మధ్యలో ఆనందం…
రంగమార్తాండ సినిమా గురించి ప్రకాష్ రాజ్ గారు చెబుతూ సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ తాను ఎంతో ఇష్టపడి చేసిన పాత్ర, ఇందులో సినిమాల్లో నాటకాల్లో నటించే ప్రతి ఆర్టిస్ట్ తనని తాను చూసుకుంటారు అంటూ చెప్పారు. ఇక సినిమాలో తన పాత్ర గురించి చెప్తూ విషాదల మధ్యలో ఆనందం వెటతుకుంటుంటాం మనం. రెండు విషాదల మధ్య విరామమే సంతోషం అంటూ చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అందరూ జీవించడానికి కారణాలు వెతుక్కుంటున్నారు. నా స్నేహితుడు ఒకతను సుసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు.
హాస్పిటల్ లో ఉన్నపుడు చూడటానికి వెళితే అక్కడ అసలు ఎందుకు మరణించాలని అనుకున్నావు దానికి కారణం వెతుకు, బ్రతకడానికి కాదు అని చెప్పాను. నా స్నేహితులదరితోనూ ఈ విషయం గురించి మాట్లాడాను. మనలో ఒకరు మౌనంగా ఉన్నారు వెనకబడిపోతున్నారంటే మన బిజీ లైఫ్ కొంచం సేపు వాళ్ళతో మాట్లాడి ధైర్యం చెప్పలేమా అనిపించింది. ఇక ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రలే ఉంటాయి. అందుకే జనాలకు బాగా కనెక్ట్ అయింది సినిమా అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…