Featured

The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు ప్రకాష్ రాజ్..?

The Kashmir Files: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చించుకున్న అంశాల్లో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా ఒకటి. దేశవ్యాప్తంగా అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే విధంగా ఉంటుంది. అయితే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఎమోషనల్ అవుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విడుదల అయ్యి ప్రశంసలు అందుకోవడం తోపాటు, జనాలకు కూడా ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.

The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు ప్రకాష్ రాజ్..?

జనాలు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా సరికొత్త రికార్డులను, చరిత్ర ను సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా మొదటి రోజు ఆరు వందల స్క్రీన్లలో మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమాపై ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపిస్తుండటంతో ఈ సినిమా స్క్రీన్ కౌంటర్ ను 600 నుంచి 2000 కు పెరిగింది. రోజు రోజుకీ ఈ సినిమాకు షోలు కూడా రెట్టింపు అవుతు స్క్రీన్లు మరిన్ని పెరుగుతున్నాయి.

The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు ప్రకాష్ రాజ్..?

ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు లేకుండా అన్ని దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమాకు దాదాపుగా నూరు కోట్ల వరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో అనుపమ కేర్, అదేవిధంగా మిథున్ చక్రవర్తి, పల్లవి జోష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాపై సామాన్యులతో పాటు సెలబ్రిటీలు స్పందించడమే కాకుండా ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవలే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాతలు పల్లవి జోష్ అభిషేక్ అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు.

ప్రశంసలు కురిపిస్తున్నారు సెలబ్రిటీలు….

ఈ సినిమా మంచి సక్సెస్ అయినందుకు గాను చిత్ర బృందానికి నరేంద్రమోడీ అభినందనలు తెలిపిన అనంతరం సినిమాపై ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోడీతో పాటుగా ఈ సినిమాపై అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇంకొందరు ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ విలక్షణ నటుడు అయిన ప్రకాష్ రాజ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సినిమా గాయాలను మాన్పుతుందా? లేక తిరిగి ఆ గాయాలను రేపుతుందా? దేశం అనే బీజాలను మళ్లీ నాటుతోందా? అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.. ఈ ప్రశ్నలను సోషల్ మీడియా వేదికగా సందిస్తూ..జస్ట్ అస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా జతచేశారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ట్వీట్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

భారత ఆధ్యాత్మికతను మార్చిన ఇద్దరు మహానుభావులు! అద్వైతం, విశిష్టాద్వైతం.. అసలు తేడా ఏమిటి?

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…

12 minutes ago

ఊరికి వస్తే చంపేస్తామంటూ హెచ్చరిక.. నటి షాకింగ్ అనుభవాలు

తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…

40 minutes ago

విష్ణువు అవతారాల్లో ప్రత్యేకమైనది ఎందుకు పరశురాముడు?

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…

42 minutes ago

రోజా రీ-ఎంట్రీ రెడీ.. ‘ఫ్యామిలీ అసెంబ్లీ’తో బుల్లితెరపై సందడి

సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…

1 hour ago

తమన్నా పిటిషన్‌కు షాక్.. హైకోర్టు కీలక తీర్పు

ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…

1 hour ago

పురుషుల కోసం కొత్త గర్భనిరోధక మాత్ర.. వైద్య రంగంలో సంచలనం!

ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…

1 hour ago