The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు ప్రకాష్ రాజ్..?
The Kashmir Files: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చించుకున్న అంశాల్లో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా ఒకటి. దేశవ్యాప్తంగా అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే విధంగా ఉంటుంది. అయితే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఎమోషనల్ అవుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విడుదల అయ్యి ప్రశంసలు అందుకోవడం తోపాటు, జనాలకు కూడా ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది.
జనాలు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా సరికొత్త రికార్డులను, చరిత్ర ను సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా మొదటి రోజు ఆరు వందల స్క్రీన్లలో మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమాపై ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపిస్తుండటంతో ఈ సినిమా స్క్రీన్ కౌంటర్ ను 600 నుంచి 2000 కు పెరిగింది. రోజు రోజుకీ ఈ సినిమాకు షోలు కూడా రెట్టింపు అవుతు స్క్రీన్లు మరిన్ని పెరుగుతున్నాయి.
ఈ సినిమాలో పెద్ద పెద్ద స్టార్లు లేకుండా అన్ని దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమాకు దాదాపుగా నూరు కోట్ల వరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో అనుపమ కేర్, అదేవిధంగా మిథున్ చక్రవర్తి, పల్లవి జోష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాపై సామాన్యులతో పాటు సెలబ్రిటీలు స్పందించడమే కాకుండా ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవలే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాతలు పల్లవి జోష్ అభిషేక్ అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు.
ఈ సినిమా మంచి సక్సెస్ అయినందుకు గాను చిత్ర బృందానికి నరేంద్రమోడీ అభినందనలు తెలిపిన అనంతరం సినిమాపై ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోడీతో పాటుగా ఈ సినిమాపై అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఇంకొందరు ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ విలక్షణ నటుడు అయిన ప్రకాష్ రాజ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సినిమా గాయాలను మాన్పుతుందా? లేక తిరిగి ఆ గాయాలను రేపుతుందా? దేశం అనే బీజాలను మళ్లీ నాటుతోందా? అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.. ఈ ప్రశ్నలను సోషల్ మీడియా వేదికగా సందిస్తూ..జస్ట్ అస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా జతచేశారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ట్వీట్ పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…