Actor Prathap Pothen: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా సినీ ప్రపంచం షాక్ కి గురైంది. ఈ క్రమంలోనే శుక్రవారం చెన్నైలోని తన ఇంటిలో వివిధ జీవిగా నటుడు ప్రతాప్ పోతేన్ మరణించారని తెలియడంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈయన నటుడిగా తెలుగు తమిళ మలయాళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. కేవలం నటుడుగా మాత్రమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా ప్రతాప్ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇకపోతే ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన తన జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ చివరికి ఒంటరిగా ఇంట్లో విగత జీవిగా మరణించడం అందరిని కలిచి వేసింది. ఈయన 1985 లోనటి రాధికను వివాహం చేసుకున్నారు అయితే వీరి వివాహమైన ఏడాదికే వీరిద్దరూ పరస్పర అభిప్రాయంతో విడాకులు తీసుకుని విడిపోయారు.
ఇలా రాధికతో విడాకులు తీసుకున్న నాలుగు సంవత్సరాల పాటు ఒంటరి జీవితాన్ని గడిపిన ప్రతాప్ తిరిగి 1990లో అమల సత్యనాథన్ ను పెళ్లి చేసుకున్నారు ప్రతాప్. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ 2012లో విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా రెండవ భార్య నుంచి కూడా విడాకులు తీసుకోవడంతో అప్పటినుంచి ప్రతాప్ చెన్నైలో ఒంటరిగా ఉంటూ పలు సినిమాలలో నటిస్తూ ఉండేవారు.
ఇకపోతే ఈయన రాధికతో విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు అయితే అప్పుడు ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రాధిక గురించి మాట్లాడుతూ తాను వ్యక్తిగతంగా ఎంతో మంచి వ్యక్తి అని చెప్పడం గమనార్హం. అయితే మా ఇద్దరికీ మనస్పర్ధలు రావడం వల్ల ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోయామని ఈయన గతంలో వెల్లడించారు.పెళ్లి అనేది అందరి జీవితానికి సరైనది కాదని, అది ఇరువురి ఆలోచనలు బట్టి ఉంటుందని చెప్పినట్లు సమాచారం.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…