Manasa Charan: ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో నటీనటులుగా నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ప్రియతమ్ చరణ్, మానస దంపతుల గురించి మనకు తెలిసిందే.వీరిద్దరూ పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇకపోతే వీరిద్దరూ పలు సీరియల్స్ లో నటించి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.ఇలా ప్రేమ పెళ్లి చేసుకుని జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఇదివరకే ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
ఇప్పటికే ఈ జంటకు రెండు సంవత్సరాల కుమారుడు ఉండగా తాజాగా మానస మరో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.ఈ క్రమంలోనే మానస చరణ్ హాస్పిటల్లో తన కుమారుడిని ఎత్తుకొని ఉండగా తన భర్త ప్రియతమ్ తనతో సెల్ఫీ ఫోటో దిగారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారికి కొడుకు పుట్టిన సంగతి తెలియజేశారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు బుల్లితెర నటినటులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మొన్నటి వరకు బేబీ బంప్ ఫోటోలతో అందరిని సందడి చేసిన మానస ప్రస్తుతం మరో పండంటి మగ బిడ్డకు జన్మనివ్వగా వీరి కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
ఇక ప్రియతమ్ చరణ్ మనసు మమత,అడగక ఇచ్చిన మనసు. లక్ష్మీ కళ్యాణం లాంటి సీరియల్స్ లో నటించి గుర్తింపు పొందారు ఇక మానస చాలెంజ్ 3లో విజేతగా గెలుపొంది ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె కూడా మాటే మంత్రము, గిరిజా కళ్యాణం వంటి సీరియల్స్ ద్వారా ఎంతో గుర్తింపు పొందారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…