Actor Sunil: తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సునీల్ ఒకరు ఈయన కెరియర్ మొదట్లో కమెడియన్ ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా కమెడియన్ గా బిజీగా ఉన్న సమయంలోనే ఈయనకు హీరోగా అవకాశం వచ్చింది. ఇలా హీరోగా పలు సినిమాలలో నటించారు అయితే హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.
ఇలా హీరోగా అవకాశాలు రావడం తగ్గిపోవడంతో తిరిగి ఈయన కమెడియన్ గా సహాయ నటుడిగా సినిమాలలో నటించారు.అలాగే విలన్ పాత్రలలో కూడా నటించారు. ప్రస్తుతం ఈయన వరుసగా విలన్ పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సునీల్ పుష్ప సినిమాలోని మంగళం శీను పాత్ర గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమాలో సునీల్ మంగళం శీను అనే విలన్ పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటనకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా అనంతరం సునీల్ కు విలన్ గా నటించడానికి ఎక్కువగా అవకాశాలు రావడం విశేషం. అయితే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మంగళం శీను పాత్ర గురించి సునీల్ పలు విషయాలు తెలియజేశారు.
తనకు సుకుమార్ తో ఉన్నటువంటి మంచి అనుబంధం కారణంగా ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అని అడిగాను. అలా అడగడంతో వెంటనే సుకుమార్ ఇప్పటికే నీ బాడీలో ఉన్న అన్ని యాంగిల్స్ చూపించావు అని అనేశారు. నీకు అవకాశం ఇవ్వాలంటే కొత్తగా ట్రై చేయాలని చెప్పారు. ఇక ఆ సమయంలో కరోనా ఉండడంతో ఆయన మంగళం శీను పాత్రను డిజైన్ చేసి స్కెచ్ పంపించారు. అందుకు అనుగుణంగా నేను తయారై ఫోటో టెస్ట్ చేసి పంపించాను. చివరికి ఆ పాత్రకు తనని ఓకే చేశారని ఈ సందర్భంగా సునీల్ మంగళం శీను పాత్ర గురించి తెలుపుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…