కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం నుంచి ఇప్పటికీ అభిమానులు, సినీ ప్రముఖులు తేరుకోలేకపోతున్నారు. ఎంతో మంచి నటుడిగా మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ప్రేక్షకుల మదిలో విశేష ఆదరణ సంపాదించుకున్న పునీత్ మరణం ఒక్కసారిగా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇదిలా ఉండగా పునీత్ మరణం పై హీరో విశాల్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే విశాల్ నటించిన “ఎనిమి” సినిమా నవంబర్ 4వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరో విశాల్ నటుడు పునీత్ ను గుర్తుచేసుకుంటూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పునీత్ నటుడిగా మాత్రమే కాకుండా 1,800 మంది పిల్లలను చదివిస్తూ వారి బాధ్యతలను చూసుకోవడమే కాకుండా ఎన్నో అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నడిపిస్తూ గొప్ప మనసును చాటుకున్నారు. అయితే పునీత్ మరణం తనని ఎంతో కృంగదీసిందని, పునీత్ తనకు ఒక మంచి మిత్రుడన్న విషయాన్ని ఈ సందర్భంగా విశాల్ వెల్లడించారు.
ఇక తన మిత్రుడి మరణానంతరం తన మిత్రుడి బాధ్యతలను తాను తీసుకుంటున్నానని ఇకపై 1800 మంది పిల్లల చదువులను, వారి బాగోగులను తాను చూసుకుంటానని ఈ సందర్భంగా విశాల్ ఈ ప్రీ రిలీజ్ వేడుకలో తెలియజేశారు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు హీరో విశాల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…