కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం నుంచి ఇప్పటికీ అభిమానులు, సినీ ప్రముఖులు తేరుకోలేకపోతున్నారు. ఎంతో మంచి నటుడిగా మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ప్రేక్షకుల మదిలో విశేష ఆదరణ సంపాదించుకున్న పునీత్ మరణం ఒక్కసారిగా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇదిలా ఉండగా పునీత్ మరణం పై హీరో విశాల్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే విశాల్ నటించిన “ఎనిమి” సినిమా నవంబర్ 4వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరో విశాల్ నటుడు పునీత్ ను గుర్తుచేసుకుంటూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పునీత్ నటుడిగా మాత్రమే కాకుండా 1,800 మంది పిల్లలను చదివిస్తూ వారి బాధ్యతలను చూసుకోవడమే కాకుండా ఎన్నో అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నడిపిస్తూ గొప్ప మనసును చాటుకున్నారు. అయితే పునీత్ మరణం తనని ఎంతో కృంగదీసిందని, పునీత్ తనకు ఒక మంచి మిత్రుడన్న విషయాన్ని ఈ సందర్భంగా విశాల్ వెల్లడించారు.
ఇక తన మిత్రుడి మరణానంతరం తన మిత్రుడి బాధ్యతలను తాను తీసుకుంటున్నానని ఇకపై 1800 మంది పిల్లల చదువులను, వారి బాగోగులను తాను చూసుకుంటానని ఈ సందర్భంగా విశాల్ ఈ ప్రీ రిలీజ్ వేడుకలో తెలియజేశారు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు హీరో విశాల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…