Actress Pragathi: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇకపోతే ఏదైనా పండుగలు ప్రత్యేకమైన రోజులు వస్తే బుల్లితెరపై స్పెషల్ షో ప్లాన్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో ఈటీవీ వారు ముందుంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వినాయక చవితి సందర్భంగా మన ఊరి దేవుడు అనే ఒక స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేశారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో వైరల్ అవుతుంది.
ఈ ప్రోమోలో భాగంగా పెద్ద ఎత్తున జబర్దస్త్ కమెడియన్లు ఆటపాటలతో ఎప్పటిలాగే సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి కుష్బూ, ఇంద్రజ, ప్రగతి, కృష్ణ భగవాన్ నాగినీడు వంటి సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటి ప్రగతి మాచర్ల నియోజకవర్గం సినిమాలోని రారా రెడ్డి అనే మాస్ సాంగ్ కి మాస్ స్టెప్పులతో అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారు.అనంతరం హైపర్ ఆది నటి ప్రగతి తో మాట్లాడుతూ తనపై యధావిధిగా కౌంటర్ వేశారు.
ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ నాయనమ్మగా పిల్లలకు టీకాలు వేయించే వయసులో ఇలా టాటూలు వేయించుకోవడం ఏంటి అంటూ ఆమెపై కౌంటర్ వేశారు అదే విధంగా పిల్లలను పెంచమంటే కండలు పెంచుతున్నారు ఈ వయసులో అవసరమా అంటూ ఈయన నటి ప్రగతి పై కౌంటర్ వేశారు. మొత్తానికి ఎప్పటిలాగే ఈ కార్యక్రమం మరింత ఆటపాటలతో పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తుందని చెప్పాలి.
ఇకపోతే హైపర్ ఆది వర్ష ఇమ్మానియేల్ మధ్య జరిగిన స్కిట్ కూడా ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. ఈ స్కిట్ లో భాగంగా హైపర్ ఆది వర్ష నడుము పై ట్యూబ్ లైట్ తో కొట్టడం అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతటితో ఈ ప్రోమో పూర్తి కాగా ఈ ప్రోమో కార్యక్రమం పై భారీ అంచనాలను పెంచేస్తుంది. ప్రోమోనో ఇలాగ ఉంటే పూర్తి ఎపిసోడ్ అభిమానులకు ఎలాంటి వినోదాన్ని పంచుతుందో అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…