Actress Radhika: కర్ణాటక మాజీ సీఎం, నిర్మాత కుమారస్వామి గౌడ భార్య నటి రాధిక కుమారస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పలు సినిమాలలో నటిగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే తెలుగులో ఈమె అవతారం, భద్రాద్రి రాముడు వంటి సినిమాలో కూడా హీరోయిన్ పాత్రలు నటించినప్పటికీ ఈ సినిమాలో హిట్ కాకపోవడంతో పూర్తిగా తెలుగు తెరకు దూరమై కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రతారగా కొనసాగుతున్నారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె నిర్మాత కుమారస్వామి ప్రేమలో పడి అనంతరం తనని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈమె తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ విధంగా రాధిక తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టి డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే రాధిక తన ట్రైనర్ తో కలిసి మాస్ స్టెప్పులకు అదిరిపోయే పర్ఫామెన్స్ చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఈమె ఎనర్జీ లెవెల్స్ చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే
ఈ విధంగా తన ట్రైలర్ తో పోటీగా డాన్స్ చేస్తున్న రాధిక ఒక్కసారిగా కాలుజారి కింద పడిపోయారు. అయితే ఈమె అప్పటికే డాన్స్ చేస్తూ తన ఒంట్లో ఓపిక శక్తి కోల్పోవడంతోనే కింద పడిపోయిందని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే కుమారస్వామి కంటే ముందుగానే తాను రతన్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఆయన మరణించడంతో కుమారస్వామిని రెండవ వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…